త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ ఊరటనిచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గాను ఏకంగా రూ.994 కోట్లను లక్షకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

J

Telangana | Published On Aug 6, 2026, 8.07 pm IST

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
Advertisement
  • యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన జొన్నలకు సంబంధించి 1,01,376 మంది రైతుల అకౌంట్లలో రూ.994 కోట్లు జమ
  • ఎరువుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని మరో 10 జిల్లాల్లో ఫెర్టిలైజర్ సేల్స్ (FFS) సిస్టమ్ అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
  • నేత కార్మికుల కోసం ప్రత్యేక కుర్చీని డిజైన్ చేసి హ్యాండ్లూమ్ హ్యాకథాన్-2026 జాతీయ విజేతగా నిలిచిన వగ్గు శ్రీరామ్‌కు మంత్రి సత్కారం

Telangana Jowar Farmers Payment | త్రినేత్ర.న్యూస్ : రైతుల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ (Telangana) ప్రభుత్వం తాజాగా జొన్న రైతులకు (Jowar farmers) భారీ శుభవార్త చెప్పింది. యాసంగి 2025-26 సీజన్‌లో కనీస మద్దతు ధర (MSP)తో రికార్డు స్థాయిలో సేకరించిన జొన్నలకు గాను.. ఏకంగా రూ.994 కోట్లను 1,01,376 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఈ కొనుగోళ్లు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు.

ఎరువుల పంపిణీలో పక్కా పారదర్శకత

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్' (FFS) ఇకపై రాష్ట్రంలోని మరో 10 జిల్లాల్లో (నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్) అమలు కానుంది. దీని ద్వారా రైతులు తమ ఆధార్ కార్డుతో ఎరువులను (Fertilizers) సులభంగా కొనుగోలు చేయొచ్చు. డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో రియల్ టైమ్‌లో (Real-time) ట్రాక్ చేసే అవకాశం ఉండటంతో మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్ పడనుంది.

ఆయిల్ పామ్ సాగుపై స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో ఆయిల్ పామ్ (Oil Palm) సాగును మరింత ఉధృతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన మొక్కలను వెంటనే సరఫరా చేయాలని, కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ (Drip irrigation) ఏర్పాటులో ఎలాంటి లేట్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కంపెనీల ఫీల్డ్ స్టాఫ్ ఎప్పటికప్పుడు గ్రామాల్లోనే రైతులకు అందుబాటులో ఉండి.. ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సరైన గైడెన్స్ ఇవ్వాలని ఆదేశించారు.

జాతీయ స్థాయిలో మెరిసిన మన విద్యార్థి

మగ్గం గుంటలో గంటల తరబడి పనిచేసే నేత కార్మికుల వెన్నునొప్పిని తగ్గించేలా "ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్" (Ergonomic back support chair) ప్రొటోటైప్‌ను డిజైన్ చేసిన వగ్గు శ్రీరామ్‌ను మంత్రి తుమ్మల ప్రత్యేకంగా సత్కరించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్‌టీ (IIHT) మూడో సంవత్సరం విద్యార్థి అయిన శ్రీరామ్.. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు గాను 'హ్యాండ్లూమ్ హ్యాకథాన్-2026'లో (Handloom Hackathon-2026) జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ సాధించడం విశేషం.

Advertisement
Advertisement