Bandi Sai Bhagirath | పోలీస్ స్టేషన్ వద్దే 8 గంటలు.. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన బండి సంజయ్..!
Bandi Sai Bhagirath | తన కుమారుడిపై పోక్సో కేసు నమోదు కాకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చివరి క్షణం వరకు ప్రయత్నించారని తెలుస్తున్నది. తనను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాలని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్కు ..బండి సంజయ్ ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఉదయం నుంచి ఠాణా వద్దే
బాధితురాలు, ఆమె తల్లి
ఫిర్యాదు తీసుకునేందుకు
వెనకాడిన పోలీసులు
కరీంనగర్ లో బండి ఫిర్యాదు తీసుకున్న తర్వాతే
పేట్ బషీరాబాద్లో అర్ధరాత్రి పోక్సో కేసు
మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించిన బండి సంజయ్
అయినా ఒప్పుకోని బాలిక తల్లిదండ్రులు
పలుమార్లు సీఎంకు ఫోన్ చేసిన సంజయ్
Bandi Sai Bhagirath | త్రినేత్ర.న్యూస్ : తన కుమారుడిపై పోక్సో కేసు నమోదు కాకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చివరి క్షణం వరకు ప్రయత్నించారని తెలుస్తున్నది. తనను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాలని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్కు ..బండి సంజయ్ ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో కేసు కాకుండా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించినా బాలిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. అయితే.. బాధితురాలైన బాలిక, ఆమె తల్లి.. ఉదయం నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా దాదాపు అర్ధరాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇంతలోపే అంటే... పోక్సో కేసు నమోదయ్యే కన్నా కొన్ని గంటల ముందే బాధితురాలైన బాలికపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
కేసు విత్ డ్రా చేసుకోండి
మే 8, శుక్రవారం ఉదయం బాధితురాలైన బాలిక, ఆమె తల్లి ఫార్చూనర్ కారులో పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. మైనర్ బాలిక అయిన తమ కుమార్తెను బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ డిసెంబర్ 31న మొయినాబాద్లో ఆ తర్వాత మరో రెండు చోట్ల లొంగబరుచుకొని లైంగిక దాడి చేశారంటూ.. సాక్ష్యాలతో సహా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు. ఈ లోపు ఈ సమాచారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు చేరింది. దీంతో ఆయన మధ్య వర్తిత్వం కోసం ప్రయత్నించగా బాలిక తల్లి ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించారు. రకరకాల కారణాలు చెబుతూ.. ఫిర్యాదు తీసుకోలేదు. జరిగిందేదో జరిగి పోయిందంటూ కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసు నమోదు చేయకుండా ఉండేందుకు బండి సంజయ్ ... సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్ కు ఫోన్ చేశారు. అయితే.. ఫిర్యాదు స్వీకరించకపోతే.. తాము పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరగబోయే మోదీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటూ బాలిక, బాలిక తల్లిదండ్రులు హెచ్చరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
స్టేషన్ బెయిల్ వచ్చేలా
మైనర్ బాలిక విషయంలో పేట్ బషీరాబాద్ లో కేసు నమోదు చేసేందుకు అర్ధరాత్రి వరకు పోలీసులు తాత్సారం చేస్తే.. అటు కరీంనగర్లో మాత్రం ఆగమేఘాల మీద బాధితురాలిపై రివర్స్ కేసు పెట్టారు. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా.. బండి సాయి భగీరథ్ కు ఇబ్బంది కలగకుండా స్టేషన్ బెయిల్ వచ్చేలా కేసులు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



