త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | వాగులో ప‌డ్డ‌ ఆర్టీసీ బ‌స్సు.. కండ‌క్ట‌ర్‌కు తీవ్ర గాయాలు

RTC Bus | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండ‌ల ప‌రిధిలోని షాంపూర్ బ్రిడ్జి వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి వాగులో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో కండ‌క్ట‌ర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌ట‌య‌ప‌డ్డారు.

S

Telangana | Published On Feb 23, 2026, 3.42 pm IST

RTC Bus | వాగులో ప‌డ్డ‌ ఆర్టీసీ బ‌స్సు.. కండ‌క్ట‌ర్‌కు తీవ్ర గాయాలు
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండ‌ల ప‌రిధిలోని షాంపూర్ బ్రిడ్జి వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి వాగులో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో కండ‌క్ట‌ర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌ట‌య‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఉట్నూర్ ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కండ‌క్ట‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 30 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు సోమ‌వారం ఉద‌యం ఆదిలాబాద్ నుంచి బ‌య‌ల్దేరి ప్ర‌మాదానికి గురైంది.

https://x.com/TeluguScribe/status/2025776138283573428

Advertisement
Advertisement