త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kothagudem | చెరో రెండున్న‌రేండ్లు.. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదిరిన ఒప్పందం

Kothagudem | కొత్త‌గూడెం (Kothagudem) కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠంపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మేయ‌ర్ పీఠాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌, సీపీఐ ఒక ఒప్పందానికి వ‌చ్చాయి.

G

Telangana | Published On Feb 15, 2026, 12.33 pm IST

Kothagudem | చెరో రెండున్న‌రేండ్లు.. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదిరిన ఒప్పందం
Advertisement

Kothagudem | త్రినేత్ర‌.న్యూస్‌: కొత్త‌గూడెం (Kothagudem) కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠంపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మేయ‌ర్ పీఠాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌, సీపీఐ ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కార్పొరేషన్‌లోని (Kothagudem Corporation) మొత్తం 60 డివిజన్లకుగాను కాంగ్రెస్‌కు 22, సీపీఐకి 22 సీట్లు వచ్చాయి. ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో హంగ్ ఏర్ప‌డింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు.

దీంతో 8 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ముందుకొచ్చింది. ఫలితంగా బీఆర్‌ఎస్‌ 8 కార్పొరేటర్ల బలం కలుపుకుంటే సీపీఐకి మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. మ‌రోవైపు స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్‌ పదవి కోసం ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత నిలిపివేసింది. ఇరుపార్టీల అగ్ర నాయ‌క‌త్వం జోక్యం చేసుకోవ‌డంతో మేయ‌ర్ ప‌ద‌విపై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

మొదటి రెండున్నరేండ్లు మేయర్‌ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్‌ పదవి కాంగ్రెస్‌ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేండ్లు కాంగ్రెస్‌ మేయర్‌ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్‌ పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కాగా, పవర్‌ షేరింగ్‌పై రెండు పార్టీల స్థానిక‌ నాయ‌కులు అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

Advertisement
Advertisement