త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sai Bhagirath | కేసు న‌మోదు చేయ‌క‌పోతే.. మోదీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటాం..!

Bandi Sai Bhagirath | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంత సులువుగా నమోదు కాలేదని తెలుస్తున్నది. ఈ కేసు నమోదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం.

S

Telangana | Published On May 9, 2026, 4.09 pm IST

Bandi Sai Bhagirath | కేసు న‌మోదు చేయ‌క‌పోతే.. మోదీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటాం..!
Advertisement

పోలీస్ స్టేషన్ చుట్టూ
తిరిగి తిరిగి అలసిపోయాం
కేసు నమోదు చేయమంటే
ఇన్నిసార్లు తిప్పించుకుంటారా?
పరేడ్ గ్రౌండ్ సభ ముందు
ఆత్మార్పణ చేసుకుంటాం
పోలీసులతో.. బాధితురాలి తల్లిదండ్రులు
చివరికి..కేసు నమోదు చేసిన పోలీసులు

Bandi Sai Bhagirath |  త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంత సులువుగా నమోదు కాలేదని తెలుస్తున్నది. ఈ కేసు నమోదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం. కానీ ఇక గత్యంతరం లేక తామ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది.

మోదీ సభలో తేల్చుకుంటాం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్రలో బాలిక కుటుంబం నివాసం ఉంటున్నది. డిసెంబర్ 31న రాత్రి బండి సాయి భగీరథ్ తమ కూతురిని లొంగదీసుకున్నాడన్న విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబసభ్యులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ కూతురికి జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకున్నారు. అయితే.. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనకాడారు. దీంతో.. ఎటూ పాలు పోని బాలిక తల్లిదండ్రులు .. తాము ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మోదీ సభలోనే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో.. పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement