త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Narayanapet | ప‌ని అమ్మాయితో బంగారం వ్యాపారి ‘ల‌వ్ ఎఫైర్’.. ఇప్పుడామె 3 నెల‌ల గ‌ర్భిణి

Narayanapet | ఓ బంగారం వ్యాపారి త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న యువ‌తి(20)ని ప్రేమ పేరుతో లొంగ‌దీసుకున్నాడు. అనేక‌సార్లు ఆమెకు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఆ యువ‌తి మూడు నెల‌ల గ‌ర్భిణి.

S

Telangana | Published On Jun 16, 2026, 7.14 am IST

Narayanapet | ప‌ని అమ్మాయితో బంగారం వ్యాపారి ‘ల‌వ్ ఎఫైర్’.. ఇప్పుడామె 3 నెల‌ల గ‌ర్భిణి
Advertisement

Narayanapet | త్రినేత్ర‌.న్యూస్ : ఓ బంగారం వ్యాపారి త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న యువ‌తి(20)ని ప్రేమ పేరుతో లొంగ‌దీసుకున్నాడు. అనేక‌సార్లు ఆమెకు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఆ యువ‌తి మూడు నెల‌ల గ‌ర్భిణి. ఇప్పుడు పెళ్లి చేసుకోన‌ని ముఖం చాటేయ‌డంతో.. ఈ వివాదం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నారాయ‌ణ‌పేట జిల్లా ప‌రిధిలోని కోస్గి ప‌ట్ట‌ణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు సాయికృష్ణ స్థానికంగా గోల్డ్ షాపు నిర్వ‌హిస్తున్నాడు. వీరి నివాసంలో 20 ఏండ్ల వ‌య‌సున్న ఓ యువ‌తి ప‌ని మ‌నిషిగా ప‌ని చేస్తోంది. అయితే ఆమెను సాయికృష్ణ ప్రేమ పేరుతో లొంగ‌దీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, శారీరంగా ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం బాధిత యువ‌తి మూడు నెల‌ల గ‌ర్భిణి.

ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో సాయికృష్ణ కుటుంబ స‌భ్యుల‌ను నిల‌దీశారు. సెటిల్ చేసుకుందామ‌ని న‌చ్చ‌జెప్పేందుకు వ్యాపారి య‌త్నించాడు. డ‌బ్బులు ఆశజూపారు. కానీ యువ‌తి అందుకు ఒప్పుకోలేదు. త‌న‌ను కులం పేరుతో దూషించాడ‌ని, పెళ్లి చేసుకునేందుకు నిరాక‌రిస్తున్నాడ‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

బాధితురాలి ఒత్తిడి మేర‌కు ఆదివారం రాత్రి సాయికృష్ణ‌పై అట్రాసిటీ కేసు న‌మోదైంది. యువ‌తిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం నారాయ‌ణ‌పేట జిల్లా కేంద్రానికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ట్ట డీఎస్పీ లింగ‌య్య సోమ‌వారం రాత్రి పేర్కొన్నారు. ఇరు కుటుంబాల వివ‌రాల‌ను సేక‌రించారు. ముఖ్యంగా సాయికృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌పై పోలీసులు ఆరా తీశారు.

Advertisement
Advertisement