త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Department | ఎక్సైజ్‌శాఖ‌లో 90 మంది అధికారుల‌కు ప‌దోన్న‌తులు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన క‌మిష‌న‌ర్

Excise Department | తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో అధికారులకు ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు క‌ల్పించింది. కింది స్థాయిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ప‌దోన్న‌తులు ఇచ్చిన‌ట్లు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

P

Telangana | Published On Jan 9, 2026, 7.47 pm IST

Excise Department | ఎక్సైజ్‌శాఖ‌లో 90 మంది అధికారుల‌కు ప‌దోన్న‌తులు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన క‌మిష‌న‌ర్
Advertisement

Excise Department | తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో అధికారులకు ప్ర‌భుత్వం ప‌దోన్న‌తులు క‌ల్పించింది. కింది స్థాయిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ప‌దోన్న‌తులు ఇచ్చిన‌ట్లు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అధికారుల‌ను ఎక్సైజ్‌ ఇన్‌సెక్టర్లకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌లుగా, సబ్‌ ఇన్‌సెక్టర్లకు ఇన్‌స్పెక్టర్లుగా ముగ్గురు సభ్యులతో కూడిన డీపీసీ కమిటీ 16 ఇన్‌స్పెక్టర్లకు 30 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతులు క‌ల్పించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ పదోన్నతులకు డీపీసీ (డిపార్ట్‌మెంట్‌ల్‌ ప్రమోషన్ల కమిటీ) సభ్యులు ఎం రఘునందన్‌రావు, సెక్రెట‌రీ (సీటీ అండ్‌ ఎక్సైజ్‌), ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్ సీ హరికిరణ్‌, జాయింట్‌ సెకట్రరీ రెవెన్యూ జేవీ విజయలక్ష్మీ (సభ్యులు)లతో కూడిన డీపీసీ కమిటీ 16 మంది ఇన్‌స్పెక్టర్లకు, 30 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతులు క‌ల్పించింది.

ఎక్సైజ్‌ శాఖలో 16 మంది ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిడెంట్లుగా, 30 మంది ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఇన్‌స్పెక్టర్లుగా ప‌దోన్న‌తి పొందారు. సీఐల నుంచి ఏఈఎస్‌లుగా పదోన్నతులు పొందిన 16 మందిలో మల్టీజోన్‌ 1లో 8 మందికి, మల్టీజోన్‌ 2లో 8 మందికి పదోన్నతులు కల్పించారు. సబ్‌ ఇన్‌సెక్టర్ల నుంచి ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు పొందిన 30 మందిని మల్టీజోన్‌-1లో 15 మందికి, మల్టీజోన్‌-2లో 15 మందికి పదోన్నతులు కల్పించారు. డిసెంబర్ చివరి వారం, జనవరి మొదటి వారంలో ఎక్సైజ్‌ శాఖలో మొత్తం 99 మంది ఎక్సైజ్ అధికారులకు, పదోన్నతులు కల్పించారు. హెడ్‌ కానిస్టేబుళ్లల్స్‌కు ఎస్ఐలుగా, కానిస్టేబళ్లకు పదోన్నతులు కల్పించడానికి అవసరమైన జాబితాను తయారు చేయాల్సిందిగా వ
రంగల్‌, హైదరాబాద్‌ నోడల్‌ డిప్యూటి కమిషనర్లకు ఎక్సైజ్‌ కమిషనర్ సీ హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement