త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahabubabad | 30 నెల‌ల అద్దె బాకీ.. ఎంపీడీవో ఆఫీసుకు తాళం

Mahabubabad | గ‌త 30 నెల‌లుగా అద్దె చెల్లించక‌పోవ‌డంతో.. ఎంపీడీవో కార్యాల‌యానికి తాళం వేశారు. దీంతో అధికారులు గంట‌ల పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వ‌చ్చింది.

S

Telangana | Published On Jan 13, 2026, 5.19 pm IST

Mahabubabad | 30 నెల‌ల అద్దె బాకీ.. ఎంపీడీవో ఆఫీసుకు తాళం
Advertisement

Mahabubabad | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త 30 నెల‌లుగా అద్దె చెల్లించక‌పోవ‌డంతో.. ఎంపీడీవో కార్యాల‌యానికి తాళం వేశారు. దీంతో అధికారులు గంట‌ల పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర మండ‌ల కేంద్రంలో వెలుగు చూసింది.

పెద్దవంగర మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అయితే గ‌త 30 నెల‌ల నుంచి ఇంటి య‌జ‌మానికి అధికారులు అద్దె చెల్లించ‌లేదు. గ‌తంలో 8 నెల‌ల అద్దె బ‌కాయికి సంబంధించి రూ. 56 వేల చెక్కును అధికారులు సిద్ధం చేసి ఇచ్చారు. ఆ చెక్కును మ‌రిపెడ ఎస్‌టీవోలో ఇవ్వ‌గా.. వెయిటింగ్ ఫ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ అఫ్రూవ‌ల్ అని ఆన్‌లైన్‌లో చూపిస్తున్న‌ది. ఇప్ప‌టికీ ఆ 8 నెల‌ల అద్దె య‌జ‌మానికి అంద‌లేదు. దీంతో మొత్తం 30నెలల అద్దె రూ.2.10 లక్షలు బకాయిలు, అదేవిధంగా రూ. ల‌క్షా 80 వేల కరెంట్ బిల్లు బకాయి ఉండడంతో యజమాని రాంపాక నారాయణ మంగ‌ళ‌వారం ఉద‌యం కార్యాలయానికి తాళం వేశారు.

షాకైన ఎంపీడీవో..

ఇంటి య‌జ‌మాని నారాయ‌ణ ఎంపీడీవో కార్యాల‌యానికి తాళం వేయ‌డంతో ఎంపీడీవోతో పాటు మిగతా సిబ్బంది షాక‌య్యారు. గంటల పాటు రోడ్డుపైనే నిరీక్ష‌ణ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎంపీడీవో వేణుమాధ‌వ్ బ‌కాయి ఉన్న అద్దెను చెల్లిస్తామ‌ని, ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లామ‌ని య‌జ‌మానికి చెప్పాడు. దాంతో శాంతించిన నారాయ‌ణ‌.. చివ‌ర‌కు కార్యాల‌యానికి వేసిన తాళం తీయ‌డంతో అధికారులు త‌మ ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయారు.

https://x.com/i/status/2010998253639319898

Advertisement

తాజావార్తలు

Advertisement