త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..

Electric Vehicles | భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ మే నెలలో మరింత వేగం అందుకుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు బ్యాటరీ ఆధారిత వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు నోమురా, హెచ్‌ఎస్‌బీసీ నివేదికలు వెల్లడించాయి. నోమురా నివేదిక ప్రకారం, మే నెలలో ప్రయాణికుల వాహనాల మొత్తం అమ్మకాలలో ఈవీల వాటా 6.4 శాతానికి చేరుకుంది.

S

Automobiles | Published On Jun 2, 2026, 1.53 pm IST

Electric Vehicles | EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
Advertisement

Electric Vehicles | భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ మే నెలలో మరింత వేగం అందుకుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు బ్యాటరీ ఆధారిత వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు నోమురా, హెచ్‌ఎస్‌బీసీ నివేదికలు వెల్లడించాయి. నోమురా నివేదిక ప్రకారం, మే నెలలో ప్రయాణికుల వాహనాల మొత్తం అమ్మకాలలో ఈవీల వాటా 6.4 శాతానికి చేరుకుంది. ఇది ఎఫ్‌వై26లో నమోదైన 4 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కావ‌డం విశేషం. అదే సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా గతేడాది సుమారు 6.5 శాతం నుంచి 8.9 శాతానికి పెరిగింది. వినియోగదారుల డిమాండ్ భావన ఈవీల వైపు మరింతగా మారిందని, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం బలపడుతోందని నోమురా పేర్కొంది.

భారీగా పెరిగిన బుకింగ్స్‌..

హెచ్‌ఎస్‌బీసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. మే నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ చొచ్చుకుపోయే స్థాయి 9.3 శాతంగా, ఎలక్ట్రిక్ ప్రయాణికుల వాహనాల వాటా 6.6 శాతంగా అంచనా వేసింది. కార్ల తయారీ సంస్థల్లో టాటా మోటార్స్ ఈ ధోరణి నుంచి అత్యధిక లాభం పొందుతోంది. కంపెనీ ఈవీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 85 శాతం పెరిగాయి. గత రెండు నెలల్లో ఈవీ బుకింగ్‌లు 2.5 రెట్లు పెరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రూ.15 లక్షల లోపు ధరల విభాగంలో డిమాండ్ బలంగా ఉందని నోమురా తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ తన నెలవారీ ఈవీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10వేల యూనిట్ల నుంచి 15వేల‌ యూనిట్లకు పెంచాలని ప్రణాళిక రూపొందిస్తోంది.

అగ్ర స్థానంలో టీవీఎస్ మోటార్స్‌..

ద్విచక్ర వాహనాల విభాగంలో కూడా ఇదే ఉత్సాహం కనిపించింది. మే నెలలో సుమారు 42వేల ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్లతో టీవీఎస్ మోటార్స్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ స్థానాలు దక్కించుకున్నాయి. ఏథర్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన రెండింతలకు పైగా పెరగడంతో కంపెనీ మార్కెట్ వాటా 16.5 శాతానికి చేరుకున్నట్లు నోమురా వెల్లడించింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల తయారీ సంస్థలకు సవాలుగా ఉన్నప్పటికీ, విద్యుదీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. అనుకూల ప్రభుత్వ విధానాలు, వినియోగదారులలో పెరుగుతున్న ఆమోదం కారణంగా భారత ఈవీ మార్కెట్ కీలక మలుపు దశలోకి ప్రవేశించిందని నోమురా పేర్కొంది.

Advertisement
Advertisement