త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OpenAI vs Anthropic Rivalry | మోదీ స్టేజ్‌పై AI వార్.. చేతులు కలపని చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ సీఈవోలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో

ఢిల్లీ వేదికగా జరుగుతున్న 'AI ఇంపాక్ట్ సమ్మిట్'లో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు టెక్ దిగ్గజాలంతా చేతులు కలిపి ఫోటోకు పోజులివ్వగా, ప్రత్యర్థులైన సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడెయ్ మాత్రం చేతులు కలపడానికి నిరాకరించి పిడికిలి బిగించి నిలబడ్డారు.

J

Technology | Published On Feb 19, 2026, 7.10 pm IST

OpenAI vs Anthropic Rivalry | మోదీ స్టేజ్‌పై AI వార్.. చేతులు కలపని చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ సీఈవోలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో
Advertisement

OpenAI vs Anthropic Rivalry | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' ఒక ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న ఇద్దరు దిగ్గజాలు - OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ - ప్రధాని మోదీ సమక్షంలోనే తమ మధ్య ఉన్న శతృత్వాన్ని పరోక్షంగా బయటపెట్టారు.

అసలేం జరిగింది?

సమ్మిట్ నాలుగో రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలతో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా AI విషయంలో ఏకతాటిపై ఉందనే సందేశాన్ని ఇచ్చేందుకు, అందరూ చేతులు కలిపి పైకి ఎత్తాలని ప్రధాని కోరారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా మిగిలిన వారంతా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఐక్యతను చాటారు.

అయితే, పక్కపక్కనే నిలబడిన సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడెయ్ మాత్రం ఒకరి చేయి ఒకరు పట్టుకోవడానికి ఇష్టపడలేదు. మిగిలిన వారంతా చేతులు పట్టుకోగా, వీరు మాత్రం తమ పిడికిళ్లను విడివిడిగా బిగించి పైకి ఎత్తారు. దీంతో అక్కడ ఒక చిన్న 'లింక్' తెగిపోయినట్లు కనిపించింది. ఈ వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

ఈ వైరాగ్యానికి కారణం ఇదేనా?

డారియో అమోడెయ్ గతంలో OpenAI లోనే సీనియర్ బాధ్యతల్లో ఉండేవారు. అయితే, AI భద్రత, వాణిజ్యీకరణ విషయంలో సామ్ ఆల్ట్‌మాన్ తీరుతో విభేదించి, 2021లో తన సోదరి డానియెలాతో కలిసి 'ఆంత్రోపిక్' సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటీవల ఆంత్రోపిక్ సంస్థ సూపర్ బౌల్ ప్రకటనల ద్వారా OpenAI పై విమర్శలు చేయగా, ఆల్ట్‌మాన్ కూడా దీటుగానే స్పందించారు.

సమ్మిట్ విశేషాలు

ఈ ఫోటోలో ప్రధాని మోదీతో పాటు సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడెయ్, అలెక్జాండర్ వాంగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. భారత్‌ను గ్లోబల్ AI హబ్‌గా మార్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement