త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Meets Google CEO Sundar Pichai | మన విద్యార్థులతో కలిసి గూగుల్ పనిచేయాలి.. సుందర్ పిచాయ్‌తో భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత విద్యార్థులు, నిపుణులతో గూగుల్ కలిసి పనిచేయడంపై ఆయనతో కీలక చర్చలు జరిగాయి.

J

National | Published On Feb 18, 2026, 3.39 pm IST

PM Modi Meets Google CEO Sundar Pichai | మన విద్యార్థులతో కలిసి గూగుల్ పనిచేయాలి.. సుందర్ పిచాయ్‌తో భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Advertisement
  • న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026
  • ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మధ్య ప్రత్యేక సమావేశం
  • AI రంగంలో భారత యువత, విద్యార్థుల ప్రతిభను గూగుల్ ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై చర్చ
  • ఫిన్లాండ్ ప్రధాని, స్పెయిన్ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

PM Modi Meets Google CEO Sundar Pichai | త్రినేత్ర.న్యూస్ : కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' (India AI Impact Summit 2026) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో (Sundar Pichai) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భారతీయ విద్యార్థులు, నిపుణుల గురించి ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత టాలెంట్‌పై ఫోకస్

ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ సందర్భంగా సుందర్ పిచాయ్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. AI రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి గురించి చర్చించాం. ముఖ్యంగా, ఈ రంగంలో మా ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఎలా పనిచేయగలదనే విషయంపై మాట్లాడుకున్నాం" అని మోదీ ట్వీట్ చేశారు.

https://x.com/narendramodi/status/2024030030024622539

ఇతర దేశాధినేతలతో చర్చలు

ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ పలువురు ప్రపంచ దేశాల అధినేతలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిన్లాండ్ ప్రధాని పెటేరి ఓర్పోతో (Petteri Orpo) జరిగిన భేటీలో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), 6G టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలపై చర్చించారు.

https://x.com/narendramodi/status/2024029328393334950

స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో (Pedro Sanchez) రక్షణ, భద్రత, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చలు జరిగాయి. 2026ను 'ఇండియా-స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ AI'గా జరుపుకుంటున్నట్లు మోదీ తెలిపారు.

https://x.com/narendramodi/status/2024028781036662920

AI సమ్మిట్ విశేషాలు

ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ సదస్సులో 110కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. "సర్వజన హితాయ - సర్వజన సుఖాయ" అనే నినాదంతో, మానవాళికి మేలు చేసే ఏఐ అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది.

PM Modi Meets Google CEO Sundar Pichai Google Can Work with Our Talented Students

Advertisement
Advertisement