త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT | చాట్‌జీపీటీ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఏఐ పోటీలో ఓపెన్‌ఏఐ కొత్త వ్యూహం..

ChatGPT | ఏఐ రంగంలో ఆధిపత్య పోరు మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విస్తృత స్థాయిలో వినియోగదారులను ఆకర్షించేందుకు టోకెన్‌ల ధరలను భారీగా తగ్గించే అంశంపై సంస్థ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది.

S

Technology | Published On Jun 13, 2026, 5.30 pm IST

ChatGPT | చాట్‌జీపీటీ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఏఐ పోటీలో ఓపెన్‌ఏఐ కొత్త వ్యూహం..
Advertisement

ChatGPT | ఏఐ రంగంలో ఆధిపత్య పోరు మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విస్తృత స్థాయిలో వినియోగదారులను ఆకర్షించేందుకు టోకెన్‌ల ధరలను భారీగా తగ్గించే అంశంపై సంస్థ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయ దశకు చేరుకోలేదని తెలుస్తోంది. టోకెన్‌లు అంటే ఏఐ మోడల్ ఒక వినియోగదారుడితో సంభాషణ సమయంలో ఎంత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందో, ఎంత కంటెంట్‌ను రూపొందిస్తుందో కొలిచే ప్రమాణం. ప్రస్తుతం ఏఐ సంస్థలు టోకెన్ వినియోగం ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉచిత ప్లాన్‌ల నుంచి ప్రీమియం ప్లాన్‌ల వరకు ప్రతి సబ్‌స్క్రిప్షన్‌లో టోకెన్ పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటితే వినియోగదారులు ప్లాన్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది లేదా తదుపరి టోకెన్ కోటా రీసెట్ అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం 4 ప్లాన్లు అందుబాటులో..

ప్రస్తుతం చాట్‌జీపీటీ కోసం ఓపెన్‌ఏఐ నాలుగు ప్రధాన ప్లాన్‌లను అందిస్తోంది. అవి ఫ్రీ, గో, ప్లస్, ప్రో. వీటిలో గో ప్లాన్ అత్యంత చవకైనది. భారత్ లో దీని ధర నెలకు రూ.399 నుంచి ప్రారంభమవుతోంది. గత సంవత్సరం భారతీయ వినియోగదారులకు గో ప్లాన్‌పై ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా సంస్థ అందించింది. అలాగే చాట్‌జీపీటీ హైఎండ్ ప్లాన్‌ల ధరలు నెలకు రూ.10,699 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు ప్రధానంగా అధిక వినియోగం చేసే ప్రొఫెషనల్స్, డెవలపర్లు, పరిశోధకులను లక్ష్యంగా చేసుకుని అందుబాటులో ఉంచారు. ఏఐ రంగంలో పోటీ తీవ్రతరమవడానికి మరో కారణం ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థలు పబ్లిక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండటమే. ఓపెన్‌ఏఐతోపాటు దాని ప్రధాన ప్రత్యర్థి ఆంథ్రోపిక్ కూడా తమ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రక్రియ కోసం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) వద్ద గోప్య పత్రాలను దాఖలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఓపెన్ ఏఐని దాటిన ఆంథ్రోపిక్‌..

2015లో స్థాపించిన ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీ విజయంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. కృత్రిమ మేధస్సు వాణిజ్యీకరణలో ప్రపంచ పోటీని మరింత వేగవంతం చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. మార్చి 2026లో జరిగిన తాజా నిధుల సమీకరణ తర్వాత ఓపెన్‌ఏఐ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం 965 బిలియన్ డాలర్ల విలువతో ఆంథ్రోపిక్ ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన ఏఐ సంస్థగా నిలిచిందని నివేదికలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement