త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Team India Fans | అచ్చిరాని న‌రేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియా గెల‌వాల‌ని అభిమానుల పూజ‌లు..

Team India Fans | టీమిండియా ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 ప‌రుగుల‌ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు సూర్య‌కుమార్ యాద‌వ్ నాయకత్వంలోని జట్టు ఆదివారం జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

S

Cricket | Published On Mar 7, 2026, 11.41 am IST

Team India Fans | అచ్చిరాని న‌రేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియా గెల‌వాల‌ని అభిమానుల పూజ‌లు..
Advertisement

Team India Fans | టీమిండియా ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 ప‌రుగుల‌ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు సూర్య‌కుమార్ యాద‌వ్ నాయకత్వంలోని జట్టు ఆదివారం జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత జట్టు అదృష్టం మారాలని కోరుకుంటూ కొందరు అభిమానులు సరదాగా నజర్ ఉతార్నా అనే సంప్రదాయాన్ని అనుసరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిష్టి దూరం కావాలనే ఉద్దేశంతో వారు సరదాగా ఈ ఆచారాన్ని నిర్వహించారు.

చేదు జ్ఞాప‌కాలు గుర్తుకు..

అహ్మదాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌కు అదృష్టం పెద్దగా కలిసి రావ‌డం లేదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఇదే మైదానంలో జరిగింది. అదేవిధంగా ఈ స్టేడియం అభిమానులకు 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తోంది. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ టైటిల్ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. ఈ కారణాల వల్లనే అభిమానులు సరదాగా చేసిన ఈ నజర్ ఉతార్నా వీడియో భారత్‌కు ఈసారి అదృష్టం కలిసిరావాలని కోరుకుంటున్న భావాన్ని ప్రతిబింబిస్తోంది.

https://twitter.com/LoyalSachinFan/status/2029754979335164239

2024ను పున‌రావృతం చేస్తాం: దేవ‌జిత్ సైకియా

భారత్ ఫైనల్‌కు చేరిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ‌జిత్ సైకియా జట్టు టైటిల్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024లో వెస్టిండీస్ లో సాధించిన విజయాన్ని మళ్లీ పునరావృతం చేస్తామని ఆయన అన్నారు. భారత్ ట్రోఫీని దేశానికి తీసుకువస్తుంది. ఈసారి కూడా అహ్మదాబాద్‌లో విజయం సాధిస్తామని నమ్ముతున్నాను.. అని ఆయన పేర్కొన్నారు. ఇక మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అజింక్యా నాయ‌క్ కూడా భారత జట్టు ఫైనల్‌కు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన సెమీఫైనల్ విజయం అభిమానులకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. ఇప్పుడు భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టడంతో దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సారి మళ్లీ టీమిండియా కప్ గెలుస్తుందా, లేదా అన్న‌ది చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement