DK Shivakumar | కర్నాటకలో ఐపీఎల్ టికెట్ల వివాదానికి తెర.. వెల్లడించిన డిప్యూటీ శివకుమార్..!
DK Shivakumar | కర్నాటకలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. ఈ సమస్యను చర్చల ద్వారా సర్దుబాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
DK Shivakumar | కర్నాటకలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. ఈ సమస్యను చర్చల ద్వారా సర్దుబాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టికెట్ల కేటాయింపుపై ముందుగానే అసెంబ్లీ స్పీకర్తో పాటు పలువురు నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.
ఐపీఎల్ మ్యాచ్లకు ప్రజాప్రతినిధులకు ఇంతకుముందు ఇచ్చే నాలుగు టికెట్ల స్థానంలో ఇకపై మూడు టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ల సందర్భంలో రెండు ఉచిత టికెట్లు మాత్రమే కేటాయిస్తారు. అదనపు టికెట్లు కావాలంటే కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. టికెట్లు అవసరం లేని ప్రజాప్రతినిధులు ముందుగానే లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని, ఇకపై ఈ అంశంపై వివాదం ఉండదని శివకుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రతినిధులకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయిస్తారని, వాటితో పోలిస్తే కర్ణాటకలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
చిన్నస్వామి స్టేడియం విస్తరణపై చర్చలు..
చిన్నస్వామి స్టేడియం సామర్థ్యాన్ని పెంచే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా సుమారు 20 వేల సీట్లు పెంచే ప్రతిపాదనపై అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించినట్లు శివకుమార్ తెలిపారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు అంశంపై తాను జోక్యం చేసుకోవడం ఇష్టపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం భూముల కేటాయింపును చేపట్టినట్లు తెలిపారు. బెంగళూరులో గోల్డెన్ స్పా సమీపంలో 25 ఎకరాలు, తుమకూరులో 25 ఎకరాలు, మైసూరులో కూడా కొంత భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో బహుళ క్రీడలకు అనుకూలంగా కొత్త స్టేడియంల నిర్మాణానికి బెంగళూరులో పలు ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






