త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO | మ‌రోసారి అద్భుతం చేసిన ఇస్రో.. చంద‌మామ కీల‌క స‌మాచారం పంపిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌..!

ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మ‌రోసారి అద్భుతం చేసింది. చంద్రయాన్-3 మిషన్‌తో మ‌రో స‌రికొత్త విష‌యాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. శివశక్తి పాయింట్‌లో చిక్కుకుపోయిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ మ‌రోసారి చంద్రుడి గురించి కీల‌క స‌మాచారాన్ని పంపింది.

P

National | Published On May 20, 2026, 9.15 pm IST

ISRO | మ‌రోసారి అద్భుతం చేసిన ఇస్రో.. చంద‌మామ కీల‌క స‌మాచారం పంపిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌..!
Advertisement

ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మ‌రోసారి అద్భుతం చేసింది. చంద్రయాన్-3 మిషన్‌తో మ‌రో స‌రికొత్త విష‌యాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. శివశక్తి పాయింట్‌లో చిక్కుకుపోయిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ మ‌రోసారి చంద్రుడి గురించి కీల‌క స‌మాచారాన్ని పంపింది. 2023లో చేప‌ట్టిన చంద్ర‌యాన్ మిష‌న్‌లో భాగంగా విక్ర‌మ్ ల్యాండ‌ర్ విజ‌య‌వంతంగా చంద్రుడిపై దిగిన విష‌యం తెలిసిందే. కొద్దిగంట‌ల పాటు ప్ర‌యోగాలు చేప‌ట్టిన త‌ర్వాత మిష‌న్‌ను నిలిపివేశారు. అయితే, ల్యాండ‌ర్‌ల ఇంకా ఇంధ‌న మిగిలే ఉండ‌డంతో ఇస్రో శాస్త్రవేత్త‌లు ల్యాండ‌ర్‌ను కొద్ది ఎత్తు వ‌ర‌కు తీసుకువెళ్లి ల్యాండ్ చేశారు. ఈ సమయంలో ఇంజిన్ల నుంచి వచ్చిన ప్రభావంతో పైపొరలోని సుమారు 3 సెంటీమీటర్ల మేరు పేరుకుపోయిన మట్టి అంతా తొలగిపోయింది.

దీంతో రెక్క‌ల గాలికి ఎప్పటికీ సూర్యకాంతి తాకని లోతైన మట్టి పొరలు సైతం వెలుగు చూశాయి. ఈ డేటా ఆధారంగా చంద్రుడి ఉపరితలం పొరలుగా ఉందని, పైభాగం చాలా మెత్తగా ఉండగా కేవలం 6 సెంటీమీటర్ల లోతులోనే గట్టి, జిగురు మట్టిగా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమధ్యరేఖ ప్రాంతాల్లో జరిగిన అపోలో మిషన్లతో పోలిస్తే ఈ తేడా మరింత స్పష్టంగా ఉందని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేప‌ట్ట‌నున్న ఆర్టెమిస్ మిష‌న్‌కు కీల‌కం కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మాన‌వ స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసే ప్ర‌ణాళిక‌ల‌కు ఈ మ‌ట్టి పొర‌ల స్వ‌భావం గురించిన కీల‌క స‌మాచారం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

Advertisement
Advertisement