త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!

Murder Case | వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జే మైత్రేయి సంచ‌ల‌న తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

P

Telangana | Published On May 20, 2026, 9.35 pm IST

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
Advertisement

Murder Case | వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జే మైత్రేయి సంచ‌ల‌న తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2024 జూలై 10 అర్ధరాత్రి చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఈ ఘోర ఘటన జరిగింది. గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు (బన్నీ) దీపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, కుటుంబ సమస్యల నేపథ్యంలో దీపిక కొంతకాలం తర్వాత పుట్టింటికి వెళ్లడంతో, భార్య దూరమైందన్న కోపం నాగరాజులో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కత్తితో దీపిక ఇంట్లోకి చొరబడిన నిందితుడు, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దీపిక తల్లి సుగుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తండ్రి శ్రీను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. దీపిక, ఆమె సోదరుడు మదన్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. విచారణలో నెక్కొండ సీఐ శ్రీనివాస్ సేకరించిన ఆధారాలతో పోలీసులు బలమైన చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితుల తరఫున స్పెషల్ పీపీ బృందాదేవి కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడి చర్య అత్యంత క్రూరంగా ఉంద‌ని, సమాజంలో ఇలాంటి నేరాలకు కఠిన శిక్ష అవసరమని ఆమె వాదించారు. ఈ మేర‌కు న్యాయ‌స్థానం నిందితుడు మేక నాగ‌రాజుకు మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ తీర్పును వెలువ‌రించారు.

Advertisement
Advertisement