Abhishek Sharma | అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఆ పోస్టులు తొలగించేందుకు ఉత్తర్వులిస్తామన్న కోర్టు
Abhishek Sharma | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏఐ జెనరేటెడ్ కంటెంట్, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
Abhishek Sharma | టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఏఐ జెనరేటెడ్ కంటెంట్, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అభిషేక్ శర్మ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్పై కోర్టు విచారణ జరుపుతోంది. అభిషేక్ శర్మ తరఫు న్యాయవాది సంబంధిత యూఆర్ఎల్ల (URL) వివరాలతో కోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికే కొన్ని పోస్టులను తొలగించినప్పటికీ.. క్రికెటర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న రెండు పోస్టులు ఇప్పటికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అనుమతి లేకుండానే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు క్రికెటర్ ఫొటోలు వాడుకొని బిజినెస్కు ఉపయోగించుకున్నాయని. వాటికి సంబంధించిన కంటెంట్ణు సైతం ఇంకా తొలగించలేదని తెలిపారు. విచారణ సందర్భంగా మెటా, అమెజాన్ సంస్థల తరఫు న్యాయవాదులు అభిషేక్ శర్మ ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులను తమ వేదికల నుంచి తొలగిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 17న జరగనుంది. అయితే, కేసు తొలి విచారణ సందర్భంగా అభ్యంతరకర యూఆర్ఎల్లకు సంబంధించిన స్క్రీన్షాట్లను అభిషేక్ శర్మ తన పిటిషన్కు జత చేయలేదు. దీంతో సంబంధిత పత్రాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం సంబంధిత స్క్రీన్షాట్లతో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని అభిషేక్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | డెక్కన్ క్రానికల్కు కేటీఆర్ నోటీసులు..! 48గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్
జులై 8, 2026

FPO | ఎఫ్పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు
జులై 8, 2026

CP Sajjanar | భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సజ్జనార్ కీలక సమావేశం.. వినాయకుడి విగ్రహాల ఎత్తుపై సూచనలు..!
జులై 8, 2026
తాజావార్తలు
- ●Food Poison | మన్ననూరులో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
- ●Gold | గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
- ●Google Photos | గూగుల్ ఫొటోస్లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్లోకి మార్చుకోవచ్చు..
- ●JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
- ●Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
- ●Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ

Food Poison | మన్ననూరులో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Gold | గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Google Photos | గూగుల్ ఫొటోస్లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్లోకి మార్చుకోవచ్చు..

JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్



