KTR | డెక్కన్ క్రానికల్కు కేటీఆర్ నోటీసులు..! 48గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్
KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు.
KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్కు లీగల్ నోటీసు పంపారు. హుస్సేన్సాగర్ సమీపంలో ఓ ప్రైవేట్ డెవలపర్కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్హౌస్ ఆస్తితో ముడిపెడుతూ కథనంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, సంబంధిత డెవలపర్, భవన అనుమతులతో కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, గతంలోనే నిరాధారంగా తేలిన అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారని ఆరోపించారు. కనీస జర్నలిస్ట్ నైతిక విలువలు పాటించకుండా, కథనం ప్రచురించే ముందు వివరణ కూడా కోరకపోవడం బాధ్యతారాహిత్యమని నోటీసులో విమర్శించారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన అన్ని డిజిటల్ లింకులను 48 గంటల్లోగా తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురించబోమని హామీ ఇవ్వాలని కోరారు. నిర్దేశించిన 48 గంటల గడువులోగా డిమాండ్లను అమలు చేయకపోతే డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై సివిల్, క్రిమినల్ కేసులతో పాటు నష్టపరిహారం కోసం కూడా చట్టపరమైన చర్యలు చేపడతామని కేటీఆర్ న్యాయవాద బృందం హెచ్చరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

FPO | ఎఫ్పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు
జులై 8, 2026

CP Sajjanar | భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సజ్జనార్ కీలక సమావేశం.. వినాయకుడి విగ్రహాల ఎత్తుపై సూచనలు..!
జులై 8, 2026

Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం.. ప్రకటించిన కేంద్రమంత్రి మాండవీయ
జులై 8, 2026
తాజావార్తలు
- ●BRS Sravan Dasoju | అన్నలు రికార్డ్ స్పీడ్తో డ్యామ్లు కడుతుంటే.. మీరు రెండు పిల్లర్ల దగ్గర పాలిటిక్స్ చేస్తున్నారు
- ●FPO | ఎఫ్పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు
- ●CP Sajjanar | భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సజ్జనార్ కీలక సమావేశం.. వినాయకుడి విగ్రహాల ఎత్తుపై సూచనలు..!
- ●Yadagirigutta Temple Board | సీఎం రేవంత్తో యాదగిరిగుట్ట నూతన పాలక మండలి భేటీ.. బోర్డు సభ్యులకు కీలక దిశానిర్దేశం
- ●ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
- ●Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం.. ప్రకటించిన కేంద్రమంత్రి మాండవీయ

BRS Sravan Dasoju | అన్నలు రికార్డ్ స్పీడ్తో డ్యామ్లు కడుతుంటే.. మీరు రెండు పిల్లర్ల దగ్గర పాలిటిక్స్ చేస్తున్నారు

FPO | ఎఫ్పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు

CP Sajjanar | భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సజ్జనార్ కీలక సమావేశం.. వినాయకుడి విగ్రహాల ఎత్తుపై సూచనలు..!

Yadagirigutta Temple Board | సీఎం రేవంత్తో యాదగిరిగుట్ట నూతన పాలక మండలి భేటీ.. బోర్డు సభ్యులకు కీలక దిశానిర్దేశం



