త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | డెక్కన్‌ క్రానికల్‌కు కేటీఆర్‌ నోటీసులు..! 48గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు.

P

Telangana | Published On Jul 8, 2026, 10.28 pm IST

KTR | డెక్కన్‌ క్రానికల్‌కు కేటీఆర్‌ నోటీసులు..! 48గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌
Advertisement

KTR | డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపారు. బుధవారం (జులై 8) రోజున దినపత్రికలో ‘KTR's 'Landlord' Builds Tower in Hussainsagar’ శీర్షికతో వచ్చిన కథనం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు లీగల్ నోటీసు పంపారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఓ ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ కథనంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, సంబంధిత డెవలపర్, భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, గతంలోనే నిరాధారంగా తేలిన అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారని ఆరోపించారు. కనీస జర్నలిస్ట్‌ నైతిక విలువలు పాటించకుండా, కథనం ప్రచురించే ముందు వివరణ కూడా కోరకపోవడం బాధ్యతారాహిత్యమని నోటీసులో విమర్శించారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన అన్ని డిజిటల్ లింకులను 48 గంటల్లోగా తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురించబోమని హామీ ఇవ్వాలని కోరారు. నిర్దేశించిన 48 గంటల గడువులోగా డిమాండ్లను అమలు చేయకపోతే డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై సివిల్, క్రిమినల్ కేసులతో పాటు నష్టపరిహారం కోసం కూడా చట్టపరమైన చర్యలు చేపడతామని కేటీఆర్ న్యాయవాద బృందం హెచ్చరించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement