త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాయం.. అయోమయంలో ఫ్యాన్స్‌..

Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు శుక్రవారం తెల్లవారుజామున (జ‌న‌వ‌రి 30, 2026) షాక్ తగిలింది. సోషల్ మీడియా ప్రపంచాన్ని కుదిపేస్తూ, కోహ్లి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా డీయాక్టివేట్ అయింది.

S

Sports | Published On Jan 30, 2026, 7.40 am IST

Virat Kohli | విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాయం.. అయోమయంలో ఫ్యాన్స్‌..
Advertisement

Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు శుక్రవారం తెల్లవారుజామున (జ‌న‌వ‌రి 30, 2026) షాక్ తగిలింది. సోషల్ మీడియా ప్రపంచాన్ని కుదిపేస్తూ, కోహ్లి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా డీయాక్టివేట్ అయింది. 27.4 కోట్లకు పైగా ఫాలోవర్లున్న @virat.kohli ప్రొఫైల్ పూర్తిగా కనిపించకుండా పోవడంతో అభిమానుల్లో ఆందోళన, అయోమయం నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయబోయిన యూజర్లకు This page isn’t available లేదా The link may be broken అనే సందేశాలు మాత్రమే కనిపించాయి. దీంతో ఈ విషయం క్షణాల్లో వైరల్‌గా మారింది.

అస‌లు విష‌యం ఏంటి..?

కోహ్లి ఖాతా మాయమవడం వెనుక టైమింగ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 124 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మళ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఇలా జరగడం అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లి ఎక్స్ ఖాతా మాత్రం యథావిధిగా యాక్టివ్‌లో ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అత‌ని నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కోహ్లి మౌనంగా ఉండటంతో అభిమానులు మరో మార్గం వెతుక్కున్నారు. అత‌ని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే ఇప్పుడు కోహ్లి అభిమానులకు హెల్ప్‌డెస్క్ గా మారింది. ఆమె తాజా పోస్టుల కింద వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అనుష్క శ‌ర్మ సైతం మౌనంగానే..

కొంతమంది అభిమానులు ఆందోళనతో ప్రశ్నలు వేస్తుండగా, మరికొందరు సరదాగా స్పందనలు ఇస్తున్నారు. రాత్రి 2 గంటలైనా కోహ్లి ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్ అధికారిక హ్యాండిల్ కింద కూడా కామెంట్లు పెడుతున్నారు.. అంటూ ఈ పరిణామాన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. అయితే అనుష్క శర్మ కూడా ఈ వ్యాఖ్యలకు ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవల ఇద్దరూ కుటుంబం, వ్యక్తిగత జీవితం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆమె కూడా మౌనంగానే ఉంటున్నారు. కోహ్లి మేనేజ్‌మెంట్ లేదా మెటా (ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ) నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు ఇది తాత్కాలిక విరామం అంటుండగా, మరికొందరు సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం కావాలనే నిర్ణయమని భావిస్తున్నారు.

వైర‌ల్ మీమ్స్‌..

కాగా, ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నిహిలిస్ట్ పెంగ్విన్ మీమ్‌కు కూడా ఈ ఘటనను కొందరు అభిమానులు లింక్ చేస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయిన పెంగ్విన్ చిత్రాలతో కోహ్లి ఖాళీ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్లను జతచేస్తూ సరదా మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆసియా వ్యక్తి. అత‌ని అకౌంట్ డీయాక్టివేషన్‌తో క్రీడా - సోషల్ మీడియా ప్రపంచంలో పెద్ద ఖాళీ ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది శాశ్వత నిర్ణయమా? లేక తాత్కాలిక విరామమా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కోహ్లి నుంచే స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు అభిమానులు ఎక్స్‌లో ఒక పోస్టు కోసం లేదా అనుష్క నుంచి ఓ సంకేతం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement