త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs SLW | మూడో టీ20లోనూ భార‌త్ గెలుపు.. సిరీస్ కైవ‌సం..

INDW Vs SLW | కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన మూడో మ‌హిళ‌ల టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ చాలా సునాయాసంగా ఛేదించింది. 5 టీ20ల సిరీస్‌ను మ‌రో 2 టీ20లు మిగిలి ఉండగానే భార‌త్ కైవ‌సం చేసుకుంది.

S

Sports | Published On Dec 26, 2025, 9.56 pm IST

INDW Vs SLW | మూడో టీ20లోనూ భార‌త్ గెలుపు.. సిరీస్ కైవ‌సం..
Advertisement

INDW Vs SLW | కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన మూడో మ‌హిళ‌ల టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ చాలా సునాయాసంగా ఛేదించింది. 5 టీ20ల సిరీస్‌ను మ‌రో 2 టీ20లు మిగిలి ఉండగానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఓపెన‌ర్ షెఫాలి వ‌ర్మ అర్థ సెంచ‌రీతో రాణించ‌గా, అంత‌కు ముందు బౌల‌ర్లు సైతం మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. దీంతో శ్రీలంక‌ను చాలా త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేశారు. ఆ త‌రువాత బ్యాటింగ్ చేసిన భార‌త్ మ‌రో 40 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌పై భార‌త్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా శ్రీ‌లంక బ్యాటింగ్ చేసింది. అయితే శ్రీ‌లంక జ‌ట్టు ఆరంభంలో దూకుడుగా ఆడుతున్న‌ట్లు క‌నిపించినా ఆ త‌రువాత వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో ప‌రుగులు సాధించ‌డం చాలా క‌ష్టంగా ఫీల‌య్యారు. భార‌త బౌల‌ర్లు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 112 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో ఎవ‌రూ చెప్పుకోదగిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. టాప్ ఆర్డ‌ర్ ప్లేయ‌ర్లు దాదాపుగా అంద‌రూ కేవ‌లం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్ ఠాకూర్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, దీప్తి శ‌ర్మ 3 వికెట్లు తీసింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెన‌ర్ స్మృతి మంధాన 6 బంతుల్లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి విఫ‌లం అయినా మ‌రో ఓపెన‌ర్ షెఫాలి వ‌ర్మ మాత్రం చివ‌రి వ‌ర‌కు ఆడి భార‌త్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది. 42 బంతులు ఆడిన షెఫాలి 11 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 79 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అలాగే చివ‌ర్లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 2 ఫోర్ల‌తో 21 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, భార‌త్ 13.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల‌ను కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో క‌విష దిల్హ‌రి 2 వికెట్లు తీసింది. కాగా ఈ మ్యాచ్‌లో విజ‌యంతో సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్ ప్ర‌స్తుతం 3-0 ఆధిక్యంలో కొన‌సాగుతుండ‌గా, ఈ సిరీస్‌లో త‌దుప‌రి 4వ మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు ఇదే వేదిక‌లో జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement