INDW Vs SLW | రెండో టీ20లోనూ భారత మహిళల జట్టు గెలుపు.. సిరీస్లో 2-0 ఆధిక్యం..
INDW Vs SLW | విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
INDW Vs SLW | విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ చాలా సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు ఆరంభం నుంచే తడబడింది. చాలా నెమ్మదిగా స్కోరు చేస్తూ వచ్చింది. వరుసగా వికెట్లను కూడా కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో హర్షిత సమరవిక్రమ 32 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేయగా, కెప్టెన్ చమారి ఆటపట్టు 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసింది. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.
ఇక భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, శ్రీచరణిలకు చెరో 2 వికెట్లు దక్కాయి. అలాగే క్రాంతి గౌడ్, స్నేహ రాణా చెరొక వికెట్ తీశారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను కోల్పోయి 129 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో షెఫాలీ వర్మ అర్థ సెంచరీతో రాణించింది. 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో షఫాలి 69 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, మరో ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 26 పరుగులు చేసి కాసేపు గ్రౌండ్లో మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. మరో 8.1 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించింది. ఇక శ్రీలంక బౌలర్లలో మల్కి మదారా, కావ్య కావింది, కవిష దిల్హరిలకు తలా 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించగా మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 26వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. కాగా ఈ సిరీస్తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల కెరీర్ను ప్రారంభించిన భారత బౌలర్ వైష్ణవి శర్మ మొదటి మ్యాచ్లో వికెట్లను తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో మ్యాచ్లో తన తొలి వికెట్ తీసిన వైష్ణవి మరో వికెట్ను కూడా తదుపరి ఓవర్లోనే పడగొట్టింది. కానీ పరుగులను సమర్పించుకుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్లో భారత్దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



