త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Team India | ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టు.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ..!

Team India | భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ మేరకు బీసీసీఐ సిరీస్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

P

Sports | Published On Mar 21, 2026, 12.27 pm IST

Team India | ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టు.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ..!
Advertisement

Team India | భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నది. ఈ టూర్‌లో ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ మేరకు బీసీసీఐ సిరీస్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్‌ గతంలో ఐర్లాండ్లో 2018, 2022, 2023లో పర్యటించింది. గత ఎనిమిదేళ్లలో ఐర్లాండ్‌లో మూడుసార్లు పర్యటించింది. ఈ సిరీస్‌లోని రెండూ మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్‌లో జరుగనుననాయి. 2007 తర్వాత బెల్‌ఫాస్ట్‌లో భారత్‌ మ్యాచులు ఆడడం ఇదే తొలిసారి. భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జూన్ 26న, రెండో టీ20 జూన్ 28న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐర్లాండ్‌ హైపర్‌ ఫెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ గ్రహం వెస్ట్‌ సిరీస్‌ను ధ్రువీకరించగా.. తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ తర్వాత భారత జట్టు జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌, మూడు వన్డేలు ఆడుతుంది. జులై ఒకటి నుంచి జులై 19 వరకు సిరీస్‌ కొనసాగుతుంది.

https://x.com/BCCI/status/2035198859870392698

Advertisement

తాజావార్తలు

Advertisement