త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌బోమ‌న్న బీసీబీ.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా రెస్పాన్స్ ఇదే..!

BCCI | త్వ‌ర‌లో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానున్న‌ది. భార‌త్‌-శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నున్నారు. భార‌త్‌లో మ్యాచులు తాము ఆడ‌బోమ‌ని బీసీబీ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. ఈ క్ర‌మంలో ఐసీసీకి లేఖ సైతం రాసింది. బీసీసీఐ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించ‌లేదు.

P

Sports | Published On Jan 10, 2026, 3.23 pm IST

BCCI | భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌బోమ‌న్న బీసీబీ.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా రెస్పాన్స్ ఇదే..!
Advertisement

BCCI | త్వ‌ర‌లో ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానున్న‌ది. భార‌త్‌-శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నున్నారు. భార‌త్‌లో మ్యాచులు తాము ఆడ‌బోమ‌ని బీసీబీ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. ఈ క్ర‌మంలో ఐసీసీకి లేఖ సైతం రాసింది. బీసీసీఐ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించ‌లేదు. తాజాగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా మౌనం వీడారు. వాస్త‌వానికి బంగ్లా ఫాస్ట్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌ను ఐపీఎల్ నుంచి తొల‌గించ‌డంతో వివాదం మొద‌లైంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫిబ్ర‌వ‌రి 7న ప్రారంభం కానున్న‌ది. బంగ్లాదేశ్‌లో త‌న గ్రూప్ ద‌శ మ్యాచులు నాలుగింటిని భార‌త్‌లోనే ఆడాల్సి ఉంది. ఇందులో ఒక‌టి కోల్‌క‌తా, మ‌రొక‌టి ముంబ‌యిలో ఉంది. ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. అప్ప‌టి నుంచి బంగ్లాదేశ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తాము సైతం పాక్ త‌ర‌హాలోనే భార‌త్‌లో ఆడ‌బోమ‌ని పేర్కొంది. ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌ను సాకుగా చూపుతున్న‌ది. ఇటీవ‌ల రెండోసారి బీసీబీ ఐసీసీకి అధికారిక లేఖ రాసింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

టీ20 ప్రపంచ కప్‌లో తమ మ్యాచ్‌లను భార‌త్ నుంచి మ‌రో శ్రీ‌లంక‌కు మార్చాల‌ని బంగ్లాదేశ్ ఐసీసీని కోరుతున్నా బీసీసీఐ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. బీసీసీఐ అధికారులు శుక్ర‌వారం ముంబ‌యిలో ఓ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో బంగ్లాదేశ్ డిమాండ్‌పై ఎలాంటి చ‌ర్చ జ‌రుగ‌లేద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి స్పష్టం చేశారు. ఈ అంశంపై తుది నిర్ణ‌యం ఐసీసీ మాత్ర‌మే తీసుకోవాల‌ని, త‌మ ప‌రిధిలో లేద‌న్నారు.

గ‌త నెల‌లో జ‌రిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ జ‌ట్టు రూ.9.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ బంగ్లాదేశ్ బౌల‌ర్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది. ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకోవడం భార‌త్‌లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌లువురు నేత‌లు బీసీసీఐతో పాటు కేకేఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ బౌల‌ర్‌ను ఐపీఎల్ నుంచి తొల‌గించ‌డంతో బీసీబీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత బంగ్లాలో ఐపీఎల్ ప్ర‌సారాల‌పై బ్యాన్ విధించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement