త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Arvind Press Meet | ఓటుకు నోటు కేసు కదిలితే.. ముందుగా రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోతారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతమైతే, ముందుగా ముఖ్యమంత్రినే ఎత్తుకుపోతారని హెచ్చరించారు. నిజామాబాద్‌లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.

J

Nizamabad | Published On Feb 14, 2026, 5.11 pm IST

Dharmapuri Arvind Press Meet | ఓటుకు నోటు కేసు కదిలితే.. ముందుగా రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోతారు
Advertisement
  • నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Arvind Press Meet | త్రినేత్ర.న్యూస్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోవడం ఖాయం

"మీ ముఖ్యమంత్రి (రేవంత్ రెడ్డి) ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు కదలడం లేదని ఆశ్చర్యపోతున్నారా? ఆ కేసు విచారణ ఏ రోజైతే వేగవంతం అవుతుందో.. ఆ రోజే మీ ముఖ్యమంత్రిని ఎత్తుకుపోతారు (అరెస్ట్ చేస్తారు). ప్రస్తుతం మీ సీఎం 'అండర్ ట్రయల్'లో ఉన్నారనే విషయం మర్చిపోవద్దు." అని అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు నెమ్మదిగా సాగుతుందో తాము ఫాలో అప్ చేస్తామని, కేటీఆర్ కేసులతో పాటు ఈ కేసును కూడా బయటకు తీస్తామని స్పష్టం చేశారు.

పోలీసులు గడ్డి పీకుతున్నారా?

నిజామాబాద్‌లో పోలీసుల తీరుపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "పోలీసులు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారా? ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చేది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికా? నిన్న రాత్రి ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందు ఏసీపీ, నలుగురు ఎస్సైలు ఏం చేస్తున్నారు? అక్కడ గడ్డి పీకుతున్నారా?" అని తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లను ఎత్తుకుపోవడానికి పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటే, గతంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే మీకు పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాంగ్రెస్ ఒక 'బ్రోకర్' పార్టీ.. ఎంఐఎంతో దోస్తీ

కాంగ్రెస్ పార్టీని 'బ్రోకర్ పార్టీ'గా అరవింద్ అభివర్ణించారు. "నిజామాబాద్‌లో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాళ్లే రుజువు చేసుకుంటున్నారు. ఎంఐఎం నేతలు కాంగ్రెస్ వాళ్లను 'పాములు, విషపాములు' అని తిట్టినప్పటికీ.. ఆత్మాభిమానం చంపుకొని మరీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటున్నారు." అని విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై కూడా ఆయన సెటైర్లు వేశారు.

వైరల్ వీడియోపై స్పందన

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీడియోపైనా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకురమ్మని పోలీసులను ఆదేశిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆరోపణలు నిజమైతే, అది అధికార దుర్వినియోగమేనని అరవింద్ మండిపడ్డారు.

మేం ప్రతిపక్షంలోనే ఉంటాం

నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీకి 28 సీట్లు వచ్చాయని, తాము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని అరవింద్ తెలిపారు. మేయర్ పీఠం కోసం తాము దిగజారుడు రాజకీయాలు చేయబోమని, ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల కోసం కొట్లాడుతామని స్పష్టం చేశారు.

https://x.com/Arvindharmapuri/status/2022624282887786703

https://x.com/Arvindharmapuri/status/2022621597987987887

 

Advertisement

తాజావార్తలు

Advertisement