Virat Kohli | సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్న కోహ్లీ
Virat Kohli | వన్డే సిరీస్ (Oneday Series) విజయం అనంతరం వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) తో కలిసి విరాట్ కోహ్లీ (Virat Kohli) సింహాద్రి అప్పన్న (Simhachalam) దర్శనం చేసుకున్నారు
Virat Kohli | సింహాచలం (Simhachalam)లోని సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం దర్శించుకున్నారు. సౌతాఫ్రికా (South Africa) తో మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మకమైన చివరి వన్డే విశాఖపట్నం (Vishakhapatnam)లో శనివారం జరగగా, అందులో భారత్ గెలుపొంది, సిరీస్ (Oneday Series)సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ (Man of the Series)గా నిలిచిన కోహ్లీ సిరీస్ ఆసాంతం రాణించారు. విజయం అనంతరం మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) తో కలిసి ఆయన ఆలయానికి రాగా, వారికి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఆలయంలోని కప్పస్తంభాన్ని కోహ్లీ ఆలింగనం చేసుకుని, మండపం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. గర్భగుడిలోని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. వారికి ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి, పూజలు నిర్వహించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ pic.twitter.com/69zyZj2Avm
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2025
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






