త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | సింహాచ‌లం న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న కోహ్లీ

Virat Kohli | వ‌న్డే సిరీస్ (Oneday Series) విజ‌యం అనంత‌రం వాషింగ్ట‌న్ సుంద‌ర్ (Washington Sunder) తో క‌లిసి విరాట్ కోహ్లీ (Virat Kohli) సింహాద్రి అప్ప‌న్న (Simhachalam) ద‌ర్శ‌నం చేసుకున్నారు

A

News | Published On Dec 7, 2025, 3.37 pm IST

Virat Kohli | సింహాచ‌లం న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న కోహ్లీ
Advertisement

Virat Kohli | సింహాచ‌లం (Simhachalam)లోని సింహాద్రి శ్రీ వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం ద‌ర్శించుకున్నారు. సౌతాఫ్రికా (South Africa) తో మూడు వ‌న్డేల సిరీస్‌లో నిర్ణ‌యాత్మ‌క‌మైన చివ‌రి వ‌న్డే విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam)లో శ‌నివారం జ‌ర‌గ‌గా, అందులో భార‌త్ గెలుపొంది, సిరీస్ (Oneday Series)సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ (Man of the Series)గా నిలిచిన కోహ్లీ సిరీస్ ఆసాంతం రాణించారు. విజ‌యం అనంత‌రం మ‌రో ప్లేయ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (Washington Sunder) తో క‌లిసి ఆయ‌న ఆల‌యానికి రాగా, వారికి, ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు.
ఆల‌యంలోని క‌ప్ప‌స్తంభాన్ని కోహ్లీ ఆలింగ‌నం చేసుకుని, మండ‌పం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేశాడు. గ‌ర్భ‌గుడిలోని స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నానంత‌రం వారికి అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. వారికి ఆల‌య అధికారులు స్వామి వారి చిత్ర‌ప‌టం, తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement