త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | జ‌ర్మ‌నీ బృందాన్ని ఆక‌ట్టుకున్న ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం, అభివృద్ధి

Telangana | జ‌ర్మ‌న్ (Germany) బుండెస్టాగ్ (Bundestag) అంతర్గత వ్యవహారాల కమిటీ చైర్మన్ జోసెఫ్ ఓస్టర్ నేతృత్వంలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందాన్ని కేసీఆర్ (KCR) నాయ‌క‌త్వంలో జ‌రిగిన‌ ప్ర‌త్యేక తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉద్య‌మం, రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రజాస్వామ్య పురోగతి, పాలన పట్ల దృక్పథం, అభివృద్ధి అంశాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఆ బృందంతో స‌మావేశ‌మైన ఎమ్మెల్సీ (MLC) డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Shravan) స‌మావేశ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తెలంగాణ ప్ర‌యాణం అంతర్జాతీయంగా విశేష ఆసక్తిని రేకెత్తించిందని చెప్పారు.

A

News | Published On Dec 13, 2025, 3.42 pm IST

Telangana | జ‌ర్మ‌నీ బృందాన్ని ఆక‌ట్టుకున్న ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం, అభివృద్ధి
Advertisement

Telangana | జ‌ర్మ‌న్ (Germany) బుండెస్టాగ్ (Bundestag) అంతర్గత వ్యవహారాల కమిటీ చైర్మన్ జోసెఫ్ ఓస్టర్ నేతృత్వంలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ప్ర‌త్యేక తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉద్య‌మం, రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రజాస్వామ్య పురోగతి, పాలన పట్ల దృక్పథం, అభివృద్ధి అంశాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఆ బృందంతో స‌మావేశ‌మైన ఎమ్మెల్సీ (MLC) డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Shravan) స‌మావేశ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తెలంగాణ ప్ర‌యాణం అంతర్జాతీయంగా విశేష ఆసక్తిని రేకెత్తించిందని చెప్పారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (KCR) నాయకత్వంలో సాగిన చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమాన్ని వారు లోతుగా పరిశీలించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఆత్మగౌరవం, సమగ్ర పాలన, సమతుల్య ఫెడరలిజం కోసం ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసిన కీలక ప్రజాస్వామ్య ఉద్యమంగా వారు గుర్తించారని ఆయన తెలిపారు. ప్రజల సంఘటిత ప్రజాస్వామ్య పోరాటం రాష్ట్ర అవతరణ తర్వాత సంస్థాగత సంస్కరణలుగా, ఆర్థిక పురోగతిగా ఎలా మారిందన్న అంశాన్ని ప్ర‌శంసించార‌ని చెప్పారు.

ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థలు, అంతర్గత పరిపాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారిశ్రామిక అభివృద్ధి, రాజ్యాంగ సంస్థల పాత్ర వంటి అంశాలపై ఈ చ‌ర్చ‌ల్లో సారవంతమైన అభిప్రాయ మార్పిడి జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య బాధ్యత, నియమావళిపై ఆధారపడిన పాలన పట్ల భారత్–జర్మనీ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ సంభాషణ ప్రతిబింబించిందని అన్నారు. బలమైన ఫెడరలిజం, సంస్థలపై ప్రజల నమ్మకం, ప్రజల ఆదేశానికి గౌరవం... ఇవే రాజకీయ స్థిరత్వానికి, సమగ్ర అభివృద్ధికి పునాదులు అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలోని సమ్మిళిత సంస్కృతి, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంతో ఉన్న అనుసంధానం కూడా ఈ చర్చల్లో ప్రాధాన్యంగా ప్రస్తావించబడ్డాయని డా. దాసోజు చెప్పారు. అలాగే భారత్–జర్మనీ మధ్య విస్తరిస్తున్న సహకార అవకాశాలపై కూడా చర్చ జరిగిందన్నారు. ఇలాంటి పరస్పర సంభాషణలు సాధారణ దౌత్య సంబంధాలకు మించి ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తాయని వ్యాఖ్యానించారు.
ప్రపంచం వేగంగా విభజన దిశగా సాగుతున్న ఈ సమయంలో ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడి సాగించే నిరంతర పార్లమెంటరీ సంభాషణలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య సంభాషణలో సార్థకంగా పాల్గొనడానికి, నేర్చుకోవడానికి, తన వంతు సహకారం అందించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement