త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Rama Navami | క‌నుల పండువ‌గా భ‌ద్రాద్రి రాములోరి క‌ల్యాణం.. ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం

Sri Rama Navami | శ్రీరామ నవమిని (Sri Rama Navami) పురస్క‌రించుకొని భద్రాచలం(Bhadhrachalam) లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హిస్తున్నారు. క‌ల్యాణ వేడుక‌ల వేళ‌ భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), గీత దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు (Silk garments), ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

S

News | Published On Mar 27, 2026, 12.46 pm IST

Sri Rama Navami | క‌నుల పండువ‌గా భ‌ద్రాద్రి రాములోరి క‌ల్యాణం.. ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: శ్రీరామ నవమిని (Sri Rama Navami) పురస్క‌రించుకొని భద్రాచలం(Bhadrachalam) లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హిస్తున్నారు. క‌ల్యాణ వేడుక‌ల వేళ‌ భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మ‌రోవైపు మిథిలా మండపంలో నిర్వ‌హిస్తున్న ఈ క్రతువును క‌నులారా తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), గీత దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు (Silk garments), ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంత‌రం మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో క‌ల‌కాలం జీవించాల‌ని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు క‌ల్యాణ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఆల‌య అధికారులు ల‌డ్డూ ప్ర‌సాదం, ఉచిత తలంబ్రాల‌కు ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు.

అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు మంత్రుల‌తో కలిసి సీఎం రేవంత్‌ భూమిపూజ చేశారు. రూ.351 కోట్లతో తొలి విడతలో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. మూడు విడ‌త‌ల్లో ప‌నులు చేయ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement