త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth | పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ చావును తానెప్పుడూ కోరుకోలేద‌ని ఆయ‌న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్టు CM Revanth Reddy చెప్పారు.

a

News | Published On Dec 21, 2025, 10.04 pm IST

CM Revanth | పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా: సీఎం రేవంత్ రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌కు సాగునీటి కేటాయింపుల్లో ద్రోహం చేసింది ముమ్మాటికీ కేసీయారేన‌ని సీఎం రేవంత్ రెడ్డి మ‌రోమారు ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం అనంతరం సీఎం ప్రెస్ ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ చావును తానెప్పుడూ కోరుకోలేద‌ని ఆయ‌న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. సాగునీటి రంగానికి కేసీఆర్ చేసినంత ద్రోహం మ‌రే నాయ‌కుడూ చేయ‌లేద‌ని తెలిపారు. చంద్ర‌బాబునాయుడికి అస‌లైన శిష్యుడు కేసీయారేన‌ని చెప్పారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు క‌ట్టొద్ద‌ని కోర్టులో కేసు వేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీయారేన‌ని ఆరోపించారు. ప‌దేళ్ల‌లో కృష్ణా న‌ది మీద ఒక్క ప్రాజెక్టు కూడా బీఆర్ ఎస్ క‌ట్ట‌లేద‌న్నారు. సాగునీటి విష‌యంలో ముఖాముఖి చర్చ‌ల‌కు ర‌మ్మంటే ఆయ‌నే ముఖం చాటేస్తున్నాడ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. 811 tmc లలో 512 tmc లు ఏపీకి ఇవ్వాలంటూ తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ డిక్ల‌రేష‌న్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశాడ‌ని ఆరోపించారు. ప‌ట్టిసీమ‌ను అభినందించింది కేసీయారేన‌ని చెప్పారు. కేవ‌లం కొడుకు-అల్లుడు కొట్టుకుంటున్నార‌నే కేసీఆర్ బ‌య‌టికి వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement