త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర : త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌

Talasani Srinivas Yadav | 220 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు త‌మ పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

P

News | Published On Jan 8, 2026, 4.33 pm IST

Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర : త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌
Advertisement

Talasani Srinivas Yadav | 220 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు త‌మ పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో స‌మావేశం నిర్వ‌హించారు. 11న తేదీన లీ ప్యాలెస్‌లో అన్ని వర్గాలతో సమావేశ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ప్రసిద్ధి అని, ఇది ప్రజా స్వామ్య ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. గ్రామం నుంచి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కాజిగిరి.. సికింద్రాబాద్‌కు ఎంతో గణ చరిత్ర ఉంద‌న్నారు. డివిజన్‌ల విభజన కూడా అంతా గందరగోళం నిర్వ‌హించార‌ని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కార్యాలయాల్లో కూర్చొని మ్యాప్‌ల ఆధారంగా డివిజన్‌ల‌ను ఏర్పాటు చేశార‌ని విమ‌ర్శించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాద‌ని, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింద‌ని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement