త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | ఖ‌రీదైన గ్యాడ్జెట్లు కాదు.. పిల్ల‌ల‌కు స‌మ‌యాన్ని కానుక‌గా ఇవ్వండి: సీపీ స‌జ్జ‌నార్

CP Sajjanar | వేస‌వి (Summar) సెల‌వులొస్తున్నాయ‌ని.. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప‌ట్ల అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP Sajjanar) సూచించారు. ఈ వేసవి సెలవు(Holidays)ల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.

S

News | Published On Apr 6, 2026, 3.09 pm IST

CP Sajjanar | ఖ‌రీదైన గ్యాడ్జెట్లు కాదు.. పిల్ల‌ల‌కు స‌మ‌యాన్ని కానుక‌గా ఇవ్వండి: సీపీ స‌జ్జ‌నార్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వేస‌వి (Summar) సెల‌వులొస్తున్నాయ‌ని.. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప‌ట్ల అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP Sajjanar) సూచించారు. సోషల్ మీడియా(Social Media) , స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరితే పిల్లల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని హెచ్చ‌రించారు. ఈ వేసవి సెలవు(Holidays)ల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. సోమ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడారు.

తల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం స‌మ‌యాన్ని వెచ్చించాల‌న్నారు. పనుల్లో నిమగ్నమై సమయాన్ని కేటాయించలేకపోవడం వల్లే వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని చెప్పారు. దీంతో పిల్లలు ఒంటరితనానికి గురవుతున్నారన్నారు. అపరిచితుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా మార‌కుండా చూసుకునే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పై ఉంద‌ని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని పేర్కొన్నారు. కేవ‌లం మందలింపులకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నార‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు నగరంలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ఒకప్పుడు వేసవి సెలవులంటే ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటలే ఉండేవ‌ని, కానీ నేటి బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో వారికి కొండంత భరోసానివ్వాల‌ని కోరారు. ఎప్ప‌టికప్పుడు వారికి దిశానిర్దేశం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement