త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మంత్రి కొండా సురేఖ‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్‌

KTR | తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి (Minister) కొండా సురేఖ‌ (Konda Surekha)కు నాంప‌ల్లి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.

A

News | Published On Dec 11, 2025, 6.56 pm IST

KTR | మంత్రి కొండా సురేఖ‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్‌
Advertisement

KTR | తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి (Minister) కొండా సురేఖ‌ (Konda Surekha)కు నాంప‌ల్లి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) దాఖ‌లు చేసిన ప‌రువున‌ష్టం కేసులో ఆమెకు ఈ వారెంట్ జారీ చేసి, త‌దుప‌రి ట్ర‌య‌ల్ కోసం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ దాఖ‌లు చేసిన సీసీ నెంబ‌ర్‌.307 ఆఫ్ 2025 కేసు నాంప‌ల్లి కోర్టులో పెండింగ్‌లో ఉండ‌గా, ట్ర‌య‌ల్ ప్రారంభం కోసం గురువారానికి (11.12.2025)కు కేసును పోస్ట్ చేశారు. కాగా, నిందితురాలు కొండా సురేఖ ఎలాంటి కారణం లేకుండా, మినహాయింపు కోసం అభ్యర్థన కూడా చేయకుండా హాజరు కాలేదు.

ఆమె తరచుగా కోర్టుకు హాజరు కాకపోవడం, విచారణలో సహకరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన నాంపల్లి కోర్టు ఆమె హాజరు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కోర్టు జారీ చేసే అరెస్ట్ ఆర్డర్‌. దీని ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచేందుకు అధికారాన్ని పొందుతారు. ఇలాంటి వారెంటులో పేరు ఉన్న వ్యక్తి త‌న హ‌క్కుగా బెయిల్‌ను డిమాండ్ చేసే అవకాశం ఉండదు.

కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్ సైట్లలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అది పూర్తిగా అవాస్త‌మ‌ని ఆమె కార్యాల‌య సిబ్బంది స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన కోర్టుకి హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింద‌ని చెప్పారు. ఈ మేరకు మీడియా మిత్రులు అందరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement