Election Boycott | కరెంట్, నీళ్లు లేవ్.. ఓటేయం.. ఎన్నికలను బహిష్కరించిన 50 కుటుంబాలు
Election Boycott | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ నందవనం (Nandavanam) గ్రామానికి చెందిన ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయబోమని తెగేసి చెబుతున్నారు. తమకు 16 ఏళ్లుగా కరెంట్, నీరు, మరుగుదొడ్లు లేవని అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని (Election Boycott) 50 కుటుంబాల(50 families)కు చెందిన ప్రజలు ప్రకటించారు.
త్రినేత్ర.న్యూస్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ నందవనం (Nandavanam) గ్రామానికి చెందిన ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయబోమని తెగేసి చెబుతున్నారు. తమకు 16 ఏళ్లుగా కరెంట్, నీరు, మరుగుదొడ్లు లేవని అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని (Election Boycott) 50 కుటుంబాల (50 families)కు చెందిన ప్రజలు ప్రకటించారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించే వరకు ఓటు వేయమని కుండబద్దలు కొడుతున్నారు.
16 ఏళ్లుగా నరకం...
తిరుచిరాపల్లిలోని నందవనం గ్రామానికి చెందిన 50కి పైగా కుటుంబాలు 16 ఏళ్లుగా సరైన సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిని విస్తరించే సమయంలో తమ ఇళ్లను ఖాళీ చేయించి నందనవం గ్రామానికి తరలించారని వాపోయారు. ఇక్కడ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రాథమిక అవసరాలు కల్పించలేదని, తాము ఎలా బతుకును వెళ్లదీసేదని నందవనం గ్రామనికి చెందిన స్థానికుడు తంగరాజ్ తన గోడు వెల్లబోసుకున్నాడు.
నలుగురు సీఎంలు మారినా...
జాతీయ రహదారి పక్కన ఉండేవాళ్లమని, ఇక్కడికి తరలించినప్పటి నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారని కనీస సౌకర్యాలైన కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు, వ్యవసాయానికి మద్దతు వంటి విషయాల్లో ఎవరూ సాయం చేయకపోవడం బాధ కలిగిస్తోందని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని తంగ్రాజ్ తో పాటు స్థానికులు డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తంగరాజ్ ఆరోపించారు. దీంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తమిళనాడులో మరో 10 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవనుంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను ఇప్పటికే వెలువరించాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా బాధిత ప్రజల పరిష్కారానికి ఎవరైనా చొరవ తీసుకుంటారో లేదోనని ఎదురు చూస్తున్నారు.
https://x.com/hashtag/WATCH?src=hashtag_click
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






