త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | తెలంగాణ భ‌వ‌న్‌లో ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్‌కు అవ‌మానం

Delhi | ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan)లో మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) ఎంపీ (MP) బ‌ల‌రాం నాయ‌క్‌ (Balram Nayak)కు తీవ్ర అవ‌మానం ఎదురైంది. భ‌వ‌న్‌లోని విలేక‌రుల స‌మావేశానికి హాల్ కావాల‌ని అడిగితే, దానికి నిరాక‌రించ‌డమే కాకుండా దురుసుగా స‌మాధాన‌మిచ్చార‌ని ఆరోపించారు

A

News | Published On Dec 12, 2025, 12.54 pm IST

Delhi | తెలంగాణ భ‌వ‌న్‌లో ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్‌కు అవ‌మానం
Advertisement

Delhi | ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో తనకు ఘోర అవమానం జరిగినట్టు మహబూబాబాద్ (Mahabubabad) కాంగ్రెస్ ఎంపీ (MP) బలరాం నాయక్ (Balram Nayak) తెలిపారు. దీనిపై ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భవన్‌లో పీఆర్‌వోగా పనిచేస్తున్న చక్రవర్తి తనతో దురుసుగా మాట్లాడారని, ఎంపీగా తన గౌరవాన్ని దెబ్బతీశారన్న ఆయ‌న ఆరోపించారు. ఎంపీల మీడియా సమావేశాలు నిర్వహించే గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌ను తనకు ఇవ్వడానికి చక్రవర్తి నిరాక‌రించార‌ని చెప్పాడు. గురజాడ హాల్లో విలేక‌రుల స‌మావేశం పెట్టాలనుకుంటున్నానని ఫోన్ చేస్తే 'కుదరదు, బయట పెట్టుకోండి' అని దురుసుగా సమాధానం ఇచ్చాడని మండిప‌డ్డారు. బంజారా సమాజానికి చెందిన ఎంపీని తక్కువగా చూసే ధోరణితో చక్రవర్తి ప్రవర్తించారన్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుదీర్ఘకాలంగా అక్కడ పనిచేస్తూ త‌న‌కు ఎదురు లేదన్నట్టు అహంకారంతో వ్యవహరిస్తున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై, ఒక‌సారి కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశాన‌ని, త‌న ప‌ట్ల ఆ రీతిగా ప్ర‌వ‌ర్తించేందుకు పీఆర్‌వో స్థాయి ఎంత అని ప్ర‌శ్నించారు. తనకు జరిగిన అవమానంపై సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement