త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Emergency landing | ‘ఇండిగో’ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌.. 161 ప్ర‌యాణికులు సేఫ్‌

Indigo | ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా అత్యవసర‌ ల్యాండ్ (Emergency landing) చేశారు. ఈ స‌మ‌యంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

S

News | Published On Mar 28, 2026, 2.09 pm IST

Emergency landing | ‘ఇండిగో’ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌.. 161 ప్ర‌యాణికులు సేఫ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి. తెల్లారి లేస్తే ఏదో ఓ విమాన ప్ర‌మాదం వార్త వినాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. మొన్న‌టికి మొన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల‌ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెనర్జీ విమానానికి ల్యాండింగ్ స‌మ‌స్య ఏర్ప‌డింది. ఇది మ‌ర‌వ‌క ముందే తాజాగా విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా అత్యవసర‌ ల్యాండ్ (Emergency landing) చేశారు. ఈ స‌మ‌యంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇండిగోకు చెందిన బోయింగ్‌ 737 విమానం శ‌నివారం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరింది. దిల్లీలో ల్యాండ్‌ అవుతుందనగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్ప‌డింది. దీంతో సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై ఇంజిన్ పనిచేయక‌పోవ‌డాన్ని గుర్తించారు. వెంట‌నే అధికారుల‌కు పైలట్‌ సమాచారం అందించగా దిల్లీ విమానాశ్రయంలో ఫుల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉద‌యం 10:53 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వ‌చ్చింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేద‌ని, సుర‌క్షితంగా ఉన్నారని అగ్నిమాపక అధికారులు చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement