Mamatha Banerjee | బెంగాల్ ఓటర్ల హక్కులపై కుట్ర.. ఈసీఐకి మమత లేఖ
Mamatha Banerjee | బెంగాల్ (Bengal)లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు కుట్రలకు తెర లేపారని సీఎం మమత బెనర్జీ (CM Mamatha Banerjee) ఆరోపించారు. బీజేపీ ప్రొద్బలంతో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ల (Fake voters) దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు ఆమె విమర్శించారు. ఈమేరకు ఈసీఐ(ECI)కి మూడు పేజీల లేఖ రాశారు.
త్రినేత్ర.న్యూస్: బెంగాల్ (Bengal)లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు కుట్రలకు తెర లేపారని సీఎం మమత బెనర్జీ (CM Mamatha Banerjee) ఆరోపించారు. బీజేపీ ప్రొద్బలంతో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ల (Fake voters) దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు ఆమె విమర్శించారు. ఈమేరకు ఈసీఐ(ECI)కి మూడు పేజీల లేఖ రాశారు. వెంటనే ప్రస్తుత పరిస్థితులను పరిశీలించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు ఆమె విజ్ఞప్తి చేశారు. బీహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దం..
బీజేపీకి చెందిన ఏజెంట్లు నివాసం లేని వారు, బయటి రాష్ట్రాల వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఓటర్ల దోపిడీ ప్రయత్నంగా అభివర్ణిస్తున్నామన్నారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా నిజమైన ఓటర్ల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, SIR ప్రక్రియలో లోపాల కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నకిలీ దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత కొరవడి పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. "ఒక రాజ్యాంగ సంస్థ నుంచి ఆశించే ప్రమాణాలు ఇవి కావు" అని ఆమె లేఖలో స్పష్టం చేశారు.
స్వేచ్ఛాయుత ఎన్నికలపై దాడి...
బెంగాల్లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై ఇది ప్రత్యక్ష దాడిగా ఆమె అభివర్ణించారు. వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. గత ఫిబ్రవరి 28న విడుదలైన తుది ఓటర్ల జాబితా తర్వాత ఎలాంటి నకిలీ ఓటర్లను చేర్చకూడదని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో బెంగాల్ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మే 4న ఫలితాలు వెలువడుతాయి.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | చోర్ చేసే వాళ్లే చోర్ చోర్ మాట్లాడతరు: కాంగ్రెస్పై బీజేపీ చీఫ్ రాంచందర్రావు సెటైర్లు
మే 5, 2026

Sunitha Lakshma Reddy | పంటలు ఎండుతున్నయ్.. సింగూర్ నీళ్లు వదలండి- ఉత్తమ్కు సునీతా లక్ష్మారెడ్డి లేఖ
ఏప్రిల్ 12, 2026

Supreme Court | న్యాయాధికారుల నిర్బంధం.. దీదీ సర్కార్పై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ
ఏప్రిల్ 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



