త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Kadiyam Kavya | కేంద్రం భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధ‌ర్నాలో ఎంపీ కడియం కావ్య

Kadiyam Kavya | భాజపా ఎంపీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ (Parliament) మకర ద్వారం వద్ద ఫ్లాకార్డులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) ధర్నా(protest)కు దిగారు. భాజపా ఎంపీ తేజస్వీ సూర్య (Tejaswi Surya) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబ‌ట్టారు.

S

News | Published On Apr 17, 2026, 12.37 pm IST

MP Kadiyam Kavya | కేంద్రం భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధ‌ర్నాలో ఎంపీ కడియం కావ్య
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: భాజపా ఎంపీ వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ (Parliament) మకర ద్వారం వద్ద ఫ్లాకార్డులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) ధర్నా(protest)కు దిగారు. భాజపా ఎంపీ తేజస్వీ సూర్య (Tejaswi Surya) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబ‌ట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్- పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత దురదృష్టకరమన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ఫ్లాకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “బీజేపీ క్షమాపణలు చెప్పాలి”, “తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి” అంటూ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం మార్మోగింది. భాజపా ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కడియం కావ్య డిమాండ్ చేశారు.

ధర్నాలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం సిగ్గుచేట‌న్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు.

రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టం క‌లిగించినప్ప‌టికీ సోనియా గాంధీ పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కావ్య పేర్కొన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ పట్ల నిరంతర వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారని, ‘బ్లాక్ డే’ వంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల భావోద్వేగాలను అవమానిస్తున్నారని విమర్శించారు. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కావ్య డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement