త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cold Waves | వ‌చ్చే మూడు రోజులు జాగ్ర‌త్త‌….

Cold Waves | | తెలంగాణ (Telangana)లో రోజు రోజుకూ చ‌లి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మూడు రోజులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది.

A

News | Published On Dec 20, 2025, 11.56 am IST

Cold Waves | వ‌చ్చే మూడు రోజులు జాగ్ర‌త్త‌….
Advertisement

Cold Waves | | తెలంగాణ (Telangana) రాష్ట్రం చ‌లిగాలుల (Cold Waves)కు వ‌ణికిపోతోంది. రోజు రోజుకూ చ‌లి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మూడు రోజులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది (Warning). దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం ఒక సంవ‌త్స‌రం మాత్రం ఇంత క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు (Lowest Temperatures) న‌మోద‌య్యాయ‌ని అధికారులు చెబుతున్నారు. అంత‌కు ముందు, ఆ త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు అలాంటి ప‌రిస్థితి లేద‌ని వివ‌రిస్తున్నారు.

ప‌డిపోతున్న క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు

రాష్ట్రంలో రోజురోజుకూ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతూనే ఉన్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయంటే ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌వ‌చ్చు. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెండ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వ‌చ్చే మూడు రోజులు చలి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా సాధార‌ణ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు నాలుగు నుంచి ఆరు డిగ్రీల వ‌ర‌కు త‌గ్గాయ‌ని పేర్కొంది.

అత్య‌ల్పంగా 6.1 డిగ్రీలు

రాష్ట్రంలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.1 డిగ్రీలుగా న‌మోదైంది. కుమ్ర‌మ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.8 డిగ్రీలు, ప‌టాన్‌చెరులో 7 డిగ్రీలు, హైదరాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ 7.2 డిగ్రీలు, రాజేంద్ర‌నగ‌ర్ 8.3 డిగ్రీలు, మౌలాలి 8.9 డిగ్రీలుగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement