Death Threat | అతన్ని పేల్చేస్తా.. గవర్నర్ను చంపుతానంటూ బెదిరింపు మెయిల్..
పశ్చిమ బెంగాల్ గవర్నర్ను (Bengal Governor) చంపుతామంటూ బెదిరింపు (Death Threat) మెయిల్ వచ్చింది. దీంతో లోక్భవన్ (రాజ్భవన్) వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
trinethra.news: పశ్చిమ బెంగాల్ గవర్నర్ను (Bengal Governor) చంపుతామంటూ బెదిరింపు (Death Threat) మెయిల్ వచ్చింది. దీంతో లోక్భవన్ (రాజ్భవన్) వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్ సీవీ ఆనంద బోస్ను (CV Ananda Bose) చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. `అతన్ని పేల్చేస్తా` (Will Blast Him) అని అందులో పేర్కొన్నారని గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
వెంటనే అప్రమత్తమైన బెంగాల్పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు లోక్భవన్ వద్ద భద్రతను పెంచారు. ఇప్పటికే ఆయన జెడ్-ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. కాగా, గవర్నర్ ఆనందబోస్ను చంపుతామంటూ బెదిరింపు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వార్నింగ్లు వచ్చాయి. అయితే మెయిల్ ఎవరు చేశారు?, ఎక్కడి నుంచి బెదిరింపు వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బెంగాల్లో తాజాగా ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు రావడం గమనార్హం. బొగ్గు చోరీ స్కాంకు సంబంధించి రాజకీయ కన్సల్టెన్సీ 'ఐ ప్యాక్'పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు కోల్కతాలోని ఐ ప్యాక్ ఆఫీసుతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరిగాయి. అయితే ప్రతీక్ ఇంట్లో సోదాలు జరుగుతుండగానే సీఎం మమతా బెనర్జీ అక్కడి వెళ్లారు. రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ దాడులు నిర్వహిస్తున్నదని మమత ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కొంచం అదుపు చేయాలని ప్రధాని మోదీకి సూచించారు. దీంతో బెంగాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అయితే సీఎం మమత కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. ఐ ప్యాక్ ఆఫీసులోకీ సీఎం ప్రవేశించి డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా లాక్కొని వెళ్లారని పేర్కొంది.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



