త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూష‌న్‌కు అనుమ‌తి.. ఆర్జీక‌ర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు

R. G. Kar Medical College | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఆస్పత్రిలో జ‌రిగిన‌ ఆర్థిక అక్రమాలు, అవినీతి కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం తాజాగా అధికారికంగా అనుమ‌తులిచ్చింది.

S

National | Published On May 19, 2026, 12.27 pm IST

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూష‌న్‌కు అనుమ‌తి.. ఆర్జీక‌ర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
Advertisement
  • చ‌ర్య‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం
  • ఇదొక పార‌ద‌ర్శ‌క చ‌ర్యగా అభివ‌ర్ణించిన సీఎం సువేందు

త్రినేత్ర‌.న్యూస్‌: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఆస్పత్రిలో జ‌రిగిన‌ ఆర్థిక అక్రమాలు, అవినీతి కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం తాజాగా అధికారికంగా అనుమ‌తులిచ్చింది. 2024, ఆగస్టులో ఇదే వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే.

చ‌ర్య‌ల‌కు గవర్నర్ ఆమోదం..

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు బెంగాల్ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ త‌న‌ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. సందీప్ ఘోష్ క్రిమినల్ ఉల్లంఘనలకు, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ల‌భించ‌డంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్ల‌డించింది.

తెరపైకి మూడు సంస్థలు..

ఈ వ్య‌వ‌హారంలో సందీప్ ఘోష్‌తో పాటు మరో మూడు ప్రైవేట్ సంస్థలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే కేసులు నమోదు చేసింది. ‘మా తారా ట్రేడర్స్’, ‘ఈశాన్ కేఫ్’, ‘ఖామ లౌహా’ అనే సంస్థలతో కలిసి ఘోష్ నేరపూరిత కుట్రకు, మోసాలకు పాల్పడినట్లు సీబీఐ తన దర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చింది.

ఇదొక పార‌ద‌ర్శ‌క‌మైన చ‌ర్య‌: సువేందు అధికారి

ఈ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసేందుకు బెంగాల్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ముఖ్యమంత్రి సువేందు అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇదొక పారదర్శకమైన, సానుకూలమైన చర్యగా ఆయ‌న‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement