లోడ్ అవుతోంది...


Karur Stampede Case | టీవీకే చీఫ్ విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట కేసుపై ఆయన్ను సీబీఐ విచారించింది. న్యూఢిల్లీలో ఉన్న సీబీఐ ఆఫీసుకు వెళ్లిన విజయ్ని అధికారులు సుమారు ఏడు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 11.29 నిమిషాలకు బ్లాక్ రేంజ్ రోవర్ కారులో సీబీఐ హెడ్క్వార్టర్స్కి విజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు టీవీకే పార్టీ ప్రతినిధులు అధవ్ అర్జున, నిర్మల్ కుమార్, మరో ఐదుగురు నేతలు ఉన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. తాజాగా విజయ్ని విచారించింది.
ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించినా.. సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా విజయ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈకేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam