త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tulip Garden | 18 లక్షల మొక్కలతో క‌నువిందు చేస్తున్న తులిప్ గార్డెన్‌

ఈ తోటను కశ్మీర్ లోయలో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం 2007 లో ప్రారంభించారు. దీన్ని అప్పట్లో మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్ అని కూడా పిలిచేవారు. తులిప్ గార్డెన్ ప్రవేశ రుసుము పెద్దలకు రూ.75 నుంచి రూ.100 వరకు ఉంటుంది. పిల్లలకు రూ.50, విదేశీ పర్యాటకులకు రూ.200 ఉంటుంది.

J

National | Published On Mar 17, 2026, 6.38 pm IST

Tulip Garden | 18 లక్షల మొక్కలతో క‌నువిందు చేస్తున్న తులిప్ గార్డెన్‌
Advertisement

Tulip Garden | త్రినేత్ర.న్యూస్ : ఆసియాలోనే అతిపెద్ద‌దైన శ్రీ‌న‌గ‌ర్‌లోని ఇందిరాగాంధీ మెమోరియ‌ల్ తులిప్ గార్డెన్ వీక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తోంది. సంద‌ర్శ‌కుల కోసం ఈ గార్డెన్‌ను జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా మార్చి 16న ప్రారంభించారు. సంద‌ర్శ‌కులకు ఆన్‌లైన్ టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 70 ర‌కాల‌కు చెందిన 18 ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటారు. ఇత‌ర ర‌కాల‌కు చెందిన ల‌క్ష మొక్క‌ల‌ను సైతం నాటారు. తొలిరోజే తోట అందాల‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు, స్థానికులు త‌ర‌లివ‌చ్చారు.

దాల్ సరస్సు పక్కనే

ఆసియాలోనే అతి పెద్ద తులిప్ తోట ఇది. జమ్ముకశ్మీర్‌లో ఉన్న దాల్ సరస్సుకు సమీపంలో జబర్వాన్ పర్వత శ్రేణుల కింద ఈ తోట ఉంటుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక నెల పాటు మాత్రమే సందర్శకులకు ఈ తోట అందుబాటులో ఉంటుంది. రంగు రంగుల వరుసలలో రకరకాల తులిప్ పువ్వులు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

2007 లో ప్రారంభం

ఈ తోటను కశ్మీర్ లోయలో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం 2007 లో ప్రారంభించారు. దీన్ని అప్పట్లో మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్ అని కూడా పిలిచేవారు. తులిప్ గార్డెన్ ప్రవేశ రుసుము పెద్దలకు రూ.75 నుంచి రూ.100 వరకు ఉంటుంది. పిల్లలకు రూ.50, విదేశీ పర్యాటకులకు రూ.200 ఉంటుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement