త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Kumar Singhal | క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారం.. టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌పై బ‌దిలీ వేటు

Anil Kumar Singhal | తిరుమల క‌ల్తీ ల‌డ్డు (Tirumala Laddu) వ్య‌వ‌హారంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. తిరుపతి దేవస్థానం ఈవో (TTD EO) అనిల్‌ కుమార్‌ సింఘాల్​పై (Anil Kumar Singhal) ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది.

G

National | Published On Feb 1, 2026, 3.37 pm IST

Anil Kumar Singhal | క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారం.. టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌పై బ‌దిలీ వేటు
Advertisement
  • జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశం
  • ముద్దాడ ర‌విచంద్ర‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు

Anil Kumar Singhal | త్రినేత్ర‌.న్యూస్‌: తిరుమల క‌ల్తీ ల‌డ్డు (Tirumala Laddu) వ్య‌వ‌హారంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. తిరుపతి దేవస్థానం ఈవో (TTD EO) అనిల్‌ కుమార్‌ సింఘాల్​పై (Anil Kumar Singhal) ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సింఘాల్‌పై బ‌దిలీ వేటు వేసిన చంద్ర‌బాబు స‌ర్కార్‌, ఆయ‌న స్థానంలో సీఎంఓ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్‌కు స్ప‌ష్టం చేసింది.

1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సింఘాల్ 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్‌ 4 వరకు టీటీడీ ఈవోగా పని చేశారు. అనంత‌రం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అనంత‌రం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీటీడీ ఈఓగా మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆయన టీటీడీ ఈవోగా కొన‌సాగుతున్నారు.

క‌ల్తీ నెయ్యి బాధ్యుడిగా..

అయితే టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ సింఘాల్‌పై టీడీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సింఘాల్‌తోపాటు అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఏ అండ్‌ సీఓ) బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల సిట్‌ ప్రభుత్వానికి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement