త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thiruparankundram Hill Controversy | మదురై కొండపై దీపం వివాదం: విజయ్ సర్కార్‌కు సుప్రీంలో దక్కని ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టేకు నో

మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దర్గా సమీపంలో దీపం వెలిగించే వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం విజయ్ ప్రభుత్వ పిటిషన్‌పై ఏమన్నదంటే?

J

National | Published On Aug 3, 2026, 3.54 pm IST

Thiruparankundram Hill Controversy | మదురై కొండపై దీపం వివాదం: విజయ్ సర్కార్‌కు సుప్రీంలో దక్కని ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టేకు నో

సంక్షిప్త సారాంశం

మదురై దర్గా సమీపంలోని దీప స్తంభంపై 'కార్తీక దీపం' వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. తాజాగా ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే, హైకోర్టు తీర్పుపై ఎక్స్-పార్టే 'స్టే' విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం నిరాకరించింది. దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisement

Thiruparankundram Hill Controversy | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం వెలిగించే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. తమిళనాడులోని కొత్త సీఎం సి.జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఆగస్టు 3, 2026 న కీలక విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. దీపం వెలిగించడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై 'స్టే' విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

సుప్రీంకోర్టులో ఏం జరిగింది?

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను విచారించింది. అయితే, జనవరిలో హైకోర్టు తీర్పు వెలువడితే.. దానిపై అప్పీల్ చేయడానికి జూన్ వరకు ఎందుకు ఆగిపోయారని తమిళనాడు ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 11న ఈ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. మదురై జిల్లా కలెక్టర్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), తమిళనాడు వక్ఫ్ బోర్డు, సికిందర్ బాదుషా దర్గా మేనేజ్‌మెంట్, ఒరిజినల్ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

అసలేంటి ఈ దీప స్తంభం వివాదం?

మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండ అడుగున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై సికిందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఆ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన రాతి స్తంభం (దీప స్తంభం) పైన 'కార్తీక దీపం' వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు భక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ (సింగిల్ జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్).. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తగిన భద్రత మధ్య దీపం వెలిగించుకోవచ్చని 2025 డిసెంబర్‌లో తీర్పు చెప్పారు. ఆ తర్వాత జనవరి 6న డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది. దీపం వెలిగించడం వల్ల దర్గా హక్కులకు ఎలాంటి భంగం కలగదని.. లా అండ్ ఆర్డర్ (Law and Order) సమస్యలు రావని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం ఏంటి?

పర్యావరణం, వారసత్వ సంపద రక్షణ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ దీపం వెలిగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం (HR&CE Department) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొండపై దర్గాకు సమీపంలో దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని వాదిస్తోంది. అంతేకాకుండా, ఆ నిర్దిష్ట రాతి స్తంభంపై దీపం వెలిగించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని.. ఆ ఆచారం వేరే చోట ఉండేదని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అయితే, ఈ వ్యవహారంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ కేసులో తదుపరి విచారణ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్‌ను గతంలో హిందూ ధర్మ పరిషత్ దాఖలు చేసిన (కొండను ఆర్కియోలాజికల్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతూ వేసిన) మరో సంబంధిత కేసుతో క్లబ్ చేసి తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement