live-in relationship | పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
live-in relationship | పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.
live-in relationship | త్రినేత్ర.న్యూస్ : పెళ్లైన పురుషుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్పూర్కు చెందిన నేత్రపాల్ అనే పెళ్లైన పురుషుడు.. 18 ఏళ్ల యువతితో సహజీవనం చేస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. మొత్తానికి ఈ కేసు కోర్టు మెట్లెక్కింది. పెళ్లైన పురుషుడు తమ బిడ్డతో సహజీవనం చేస్తున్నాడని ఇది నేరం అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది.
పెళ్లైన పురుషుడు మరో మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉండడం నేరం కాదని అలహాబాద్ కోర్టు పేర్కొంది. ఇద్దరి సమ్మతితోనే సహజీవనంలో ఉన్నారు కాబట్టి.. ఎలాంటి నేరం కాదని స్పష్టం చేసింది. సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ పెళ్లైన వ్యక్తి అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
తాను మేజర్ను అని పేర్కొంటూ షాజహాన్పూర్ ఎస్సీకి సదరు యువతి ఆధారాలతో కూడిన దరఖాస్తు సమర్పించింది. నేత్రపాల్తో ఇష్టపూర్వకంగానే ఉంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కూడా కోర్టు నొక్కి చెప్పింది. యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణభయం ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఇద్దరు వయోజనులను రక్షించడం పోలీసుల ప్రాథమిక విధి అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






