త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | పిల్ల‌ల కిడ్నాప్‌పై ఎఫ్ఐఆర్ త‌ప్ప‌నిస‌రి.. సుప్రీం ఆదేశాలు

Supreme Court | దేశంలో పిల్ల‌ల కిడ్నాప్‌పై భార‌త అత్యున్న‌త న్యాయస్థానం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పిల్ల‌ల మిస్సింగ్ కేసుల‌పై త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథ‌మిక విచార‌ణ పేరుతో ఆల‌స్యం చేయొద్ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

S

National | Published On May 23, 2026, 6.17 pm IST

Supreme Court | పిల్ల‌ల కిడ్నాప్‌పై ఎఫ్ఐఆర్ త‌ప్ప‌నిస‌రి.. సుప్రీం ఆదేశాలు
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో పిల్ల‌ల కిడ్నాప్‌పై భార‌త అత్యున్న‌త న్యాయస్థానం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పిల్ల‌ల మిస్సింగ్ కేసుల‌పై త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథ‌మిక విచార‌ణ పేరుతో ఆల‌స్యం చేయొద్ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

చిన్నారుల అక్ర‌మ ర‌వాణా స‌మ‌స్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన కోర్టు.. దేశంలో సుమారు 47 వేల మంది పిల్ల‌ల ఆచూకీ లేకుండా ఉండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి, తప్పిపోయిన పిల్లలను త్వరగా గుర్తించడానికి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. జ‌స్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్ సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.

2011లో చెన్నై సిటీలో ఓ చిన్నారి అదృశ్య‌మైంది. అయితే త‌న కుమార్తెను వెతికిపెట్టాలంటూ జి గ‌ణేశ్ అనే వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. ఈ స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 47 వేల మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, నమోదవుతున్న కేసులకు, రికవరీ అవుతున్న పిల్లల సంఖ్యకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ధర్మాసనం పేర్కొంది. పిల్లలు తప్పిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎటువంటి ప్రాథమిక విచారణలు చేయకుండా, ఆలస్యం లేకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులలో భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కిడ్నాప్, అపహరణ సెక్షన్లను చేర్చడం తప్పనిసరి.

Advertisement

తాజావార్తలు

Advertisement