Supreme Court | పాదచారులకు దారివ్వండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు (pedestrians) సురక్షితంగా నడిచేందుకు (free space for walking) ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.
Supreme Court | దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు (pedestrians) సురక్షితంగా నడిచేందుకు (free space for walking) ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. పాదచారులకు రోడ్డుపై నడిచేందుకు సరైన మార్గం లేక ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేరకు రోడ్లపై పాదచారుల ప్రాంతాలను గుర్తించి, వాకర్స్కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించాల్సిందిగా కోరింది.
తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని ట్యాంకర్ ఢీ కొన్న ఘటనపై కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎక్కడ రోడ్డు ఉందో, అక్కడ వాకర్స్ కోసం స్థలం ఉండాలి. ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా పాదచారుల మార్గాన్ని స్పష్టంగా గుర్తించండి. అది ఆక్రమణకు గురి కాకుండా చూసుకోండి" అని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం రెండు వారాల గడువు ఇచ్చింది. రహదారుల పక్కన ఉన్న స్థలం తమకేనని, ఇకపై వాహనాల భయం లేకుండా నడవచ్చనే నమ్మకం పాదచారులకు కల్పించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read..
కర్ణాటక కాంగ్రెస్లో ముసలం.. మంత్రివర్గ విస్తరణ వేళ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ సరికొత్త అధ్యాయం
F&O ట్రేడింగ్ వేళలు పొడిగింపునకు కారణాలు: సెబీ కొత్త నిబంధనల వెనుక అసలు ఉద్దేశం ఇదే!
సంబంధిత వార్తలు

CJP Student Protest Case | స్టూడెంట్స్పై కేసుల ఉపసంహరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల దౌర్జన్యంపై సీరియస్!
ఆగస్టు 3, 2026

Thiruparankundram Hill Controversy | మదురై కొండపై దీపం వివాదం: విజయ్ సర్కార్కు సుప్రీంలో దక్కని ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టేకు నో
ఆగస్టు 3, 2026

Jantar Mantar | జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●NIMS | ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ సరికొత్త అధ్యాయం
- ●Bigg Boss Agnipariksha | బిగ్బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల - వీడియోతో సర్ప్రైజ్
- ●స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు అలర్ట్: నేటి నుంచే సెబీ కొత్త ట్రేడింగ్ వేళలు అమల్లోకి.. F&O ట్రేడింగ్ ఇక 3:40 PM వరకు
- ●CJP Student Protest Case | స్టూడెంట్స్పై కేసుల ఉపసంహరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల దౌర్జన్యంపై సీరియస్!
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు లాభం..
- ●Bhatti Vikramarka | తెలంగాణలో పెట్టుబడులు పెడితే.. ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంతో అనుమతులిస్తాం

NIMS | ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ సరికొత్త అధ్యాయం

Bigg Boss Agnipariksha | బిగ్బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల - వీడియోతో సర్ప్రైజ్

స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు అలర్ట్: నేటి నుంచే సెబీ కొత్త ట్రేడింగ్ వేళలు అమల్లోకి.. F&O ట్రేడింగ్ ఇక 3:40 PM వరకు

CJP Student Protest Case | స్టూడెంట్స్పై కేసుల ఉపసంహరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల దౌర్జన్యంపై సీరియస్!



