త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాళ్ల దాడి..!

Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ ప్ర‌యాణిస్తున్న ల‌క్నో - ఢిల్లీ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఫిరోజాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో రాళ్ల దాడి జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

S

National | Published On Jun 12, 2026, 10.15 am IST

Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాళ్ల దాడి..!
Advertisement

Mohan Bhagwat | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ ప్ర‌యాణిస్తున్న ల‌క్నో - ఢిల్లీ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఫిరోజాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో రాళ్ల దాడి జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న గురువారం రాత్రి 7.45 గంట‌ల‌కు చోటు చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

ఎతావా - తుండ్ల సెక్ష‌న్ మ‌ధ్య పేమేశ్వ‌ర్ గేట్ బ్రిడ్జి వ‌ద్ద‌కు రాగానే రైలుపై రాళ్ల‌తో దాడి జ‌రిగింది. అయితే ఆ స‌మ‌యంలో భ‌గ‌వ‌త్ ఈ1 కోచ్‌లో ప్ర‌యాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయ‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఫిరోజాబాద్ ఎస్పీ ఆదిత్య లాంఘే, ఆగ్రా రైల్వే ఎస్పీ అనిల్ ఝా.. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. రాళ్ల దాడి చేసిన యువ‌కుడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు. నిందితుడిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.

Advertisement
Advertisement