త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 71 పారామెడిక‌ల్ పోస్టులు.. అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

RRB Secunderabad | భార‌తీయ రైల్వేలోని వివిధ జోన్ల‌లో పారామెడిక‌ల్ (Paramedical Posts) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 560 ఖాళీల భ‌ర్తీకి దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB Recruitment) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.

G

National | Published On Sep 15, 2026, 9.33 am IST

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 71 పారామెడిక‌ల్ పోస్టులు.. అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

RRB Secunderabad | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ రైల్వేలోని వివిధ జోన్ల‌లో పారామెడిక‌ల్ (Paramedical Posts) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 560 ఖాళీల భ‌ర్తీకి దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB Recruitment) ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఇందులో సికింద్రాబాద్ జోన్‌లో (RRB Secunderabad) 72 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. సెప్టెంబర్‌ 15 నుంచి ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌య్యాయి. అక్టోబర్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో https://indianrailways.gov.in/ అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టులు: 560
న‌ర్సింగ్ సూప‌ర్‌వైజ‌ర్ 365, డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ 1, హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్ 43, ఆడియాల‌జిస్ట్ అండ్ స్పీచ్ థెర‌పిస్ట్ 1, ఫార్మ‌సిస్ట్ (ఎంట్రీ గ్రేడ్‌) 118, రేడియోగ్రాఫ‌ర్ ఎక్స్‌రే టెక్నీషియ‌న్ 25, ఈసీజీ టెక్నీషియ‌న్ 4, ఆప్టోమెట్రిస్ట్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 31 చొప్పున ఉన్నాయి.

  • ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ ప‌రిధిలో- 71 (జ‌న‌ర‌ల్ 28, ఈడ‌బ్ల్యూఎస్ 08, బీసీ 18, ఎస్సీ 08, ఎస్టీ 9)

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్య‌ర్థులు 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కుల‌వ్వాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.500 (ప‌రీక్ష రాసిన వారికి రూ.400 తిరిగి చెల్లిస్తారు), ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, ట్రాన్స్‌జెండ‌ర్లు, మైనార్టీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు రూ.250 (ప‌రీక్ష‌కు హాజ‌రైతే తిరిగి ఇచ్చేస్తారు).
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 15
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 14
వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/

పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్‌చేయండి..

 

Advertisement
Advertisement