త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Attack| పిల్ల‌ల‌తో ఆడుకుంటుండ‌గా గుండెపోటు.. కుర్చీలోనే కుప్ప‌కూలిన టెకీ

Heart Attack | హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ప‌వ‌న్ సాయి(36) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

S

Hyderabad | Published On Sep 15, 2026, 9.24 am IST

Heart Attack| పిల్ల‌ల‌తో ఆడుకుంటుండ‌గా గుండెపోటు.. కుర్చీలోనే కుప్ప‌కూలిన టెకీ
Advertisement

Heart Attack| త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ప‌వ‌న్ సాయి(36) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 9న కాలిఫోర్నియాలోని త‌న నివాసంలో పిల్ల‌ల‌తో ఆడుకుంటుండ‌గా.. కుర్చీలోనే కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. ప‌వ‌న్ సాయి డెడ్‌బాడీని నిన్న హైద‌రాబాద్‌కు త‌ర‌లించి, బ‌న్సీలాల్‌పేట స్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన పవన్‌ సాయి 2016లో ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అనంతరం అక్కడే 2018లో ఉద్యోగంలో చేరి ప్రస్తుతం ఐబీఎంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement