త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Leaders | కాంగ్రెస్ నేతల కార్ల‌పై ప‌సుపు నీళ్లు.. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు రిమాండ్

BRS Leaders | మ‌ర్కూక్ మండ‌లం వ‌ర‌ద‌రాజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత‌ల కార్ల‌పై ప‌సుపు నీళ్ల‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌లో ఏడుగురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

S

Telangana | Published On Sep 15, 2026, 9.49 am IST

BRS Leaders | కాంగ్రెస్ నేతల కార్ల‌పై ప‌సుపు నీళ్లు.. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు రిమాండ్
Advertisement

BRS Leaders | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త మంగ‌ళ‌వారం ఎర్ర‌వ‌ల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌజ్ ముట్ట‌డికి కాంగ్రెస్ నేత‌లు బ‌య‌ల్దేరిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌ర్కూక్ మండ‌ల ప‌రిధిలోని వ‌ర‌ద‌రాజాపూర్ వ‌ద్ద కాంగ్రెస్ నేత‌ల కార్ల‌పై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ప‌సుపు నీళ్ల‌తో దాడి చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. దీంతో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాంగ్రెస్ నేత‌ల వాహ‌నాల‌పై ప‌సుపు నీళ్లు చ‌ల్లిన ఏడుగురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఆదివారం రాత్రి విజ‌య‌వాడ‌లో అరెస్టు చేశారు. అనంత‌రం కోర్టులో హాజ‌రు ప‌రిచి ఏడుగురికి రిమాండ్ విధించారు.

Advertisement
Advertisement